నిజం..మహిళల - మూత్రంతో బ్రెడ్ తయారీ..పైగా విలువైనదట!

Update: 2020-08-21 03:30 GMT
ఓ ఎంటర్ప్రైజెస్ బేకరీ మహిళల మూత్రంతో బ్రెడ్ తయారు చేస్తోంది. పైగా అది ఎంతో విలువైనదట. ఇలాంటి విషయాలు ఎక్కడా కనీవినీ ఎరిగి ఉండం. అయితే నిజంగా ఇది నమ్మలేని నిజం. మహిళల పబ్లిక్ టాయిలెట్ నుంచి మూత్రం తప్పించి భారీ స్థాయిలో బ్రెడ్ ఉత్పత్తి చేస్తున్నారు. లూయిస్ రాగెట్ అనే ఇకో ఫెమినిస్ట్ మహిళల మూత్రంతో గోధుమలను పెంచి వాటితో గోల్డి లాక్స్ బ్రెడ్ ను తయారు చేస్తోంది. యూరిన్ గోధుమ పంటకు మంచి ఎరువని ఆమె చెబుతోంది. మహిళల మూత్రంలో ఉండే పోషకాలు వృథా  కాకుండా ఫుడ్ సైకిల్ కొనసాగించడమే ఆమె ఉద్దేశం.

మహిళల రెస్ట్ రూమ్ ల  నుంచి సేకరించిన మూత్రం గోధుమల పై కూడా చల్లుతుందట. దానిని అందరూ వ్యర్థపదార్థంలా  చూస్తారు.. కానీ అది ఒక బంగారు గని.. అని ఆమె అభిప్రాయం. మూత్రంలో  నైట్రోజన్,  పొటాషియం,  ఇంకా ఎన్నో నూట్రియంట్లు కూడా ఉంటాయని అవి పంటకు ఉపయోగపడతాయని రాగెట్ చెబుతోంది. ఈ బ్రెడ్ తయారీ వివరాల గురించి ఆమె రోజూ  తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. ఎకో ఫెమినిజం నమ్మకాల కారణంగానే కేవలం మహిళల మూత్రం ఉపయోగిస్తుందట. మూత్రాన్ని ఇరవై సార్లు ఫిల్టర్ చేసి బ్రెడ్ తయారీలో వాడుతుందట. ఈ విషయం తెలిసి మూత్రంతో బ్రెడ్ తయారీ చేయడమేమిటని అంతా విస్తుపోతున్నారు.
Tags:    

Similar News