టీడీపీ నేత సోమిరెడ్డిపై కేసు నమోదు

Update: 2021-06-06 06:30 GMT
టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు నమోదయ్యింది. ఆయనపై కృష్ణపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆనందయ్య మందు విషయంలో ఓ వెబ్ సైట్ పై ఆరోపించినందుకు గాను ఈ కేసు నమోదైంది.

ఓ వెబ్ సైట్ ద్వారా వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆనందయ్య మందును పంపిణీ చేసి కోట్లు సంపాదించబోతున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి నిన్న తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై సదురు వెబ్ సైట్ శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మాదరెడ్డి సీరియస్ అయ్యారు. సోమిరెడ్డిపై తాజాగా ఈరోజు కృష్ణపట్నం పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు మేరకు సోమిరెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం కేసులను పోలీసులు నమోదు చేశారు. సోమిరెడ్డిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

-అసలు వివాదం ఇదీ

తాజాగా టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే కాకాని, ఓ వెబ్ సైట్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఆనందయ్య మందు విషయంలో ఓ వెబ్ సైట్ ను వివాదంలోకి లాగారు. ఆ వెబ్ సైట్ లో ఆనందయ్య మందుకు ధరలు పెంచి దోచుకుంటున్నారని సోమిరెడ్డి విమర్శించారు. దీనిపై తాజాగా ఆ వెబ్ సైట్ కు చెందిన శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదారెడ్డి, సోమిరెడ్డి చేస్తున్న ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. తమ వెబ్ సైట్ గురించి సోమిరెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలేనని అన్నారు.
Tags:    

Similar News