పాజిటివ్ వచ్చినా నిశ్చింతగా: పాలసీ తీసుకుంటే ఖర్చంతా కంపెనీలదే..
వైరస్ విజృంభణ తీవ్రస్థాయిలో ఉంది. కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వైరస్ బారిన సంపన్నులతో పాటు పేద, మధ్య తరగతి వారు కూడా పడుతున్నారు. మధ్య తరగతి, సంపన్నులు వైరస్కు ఎలాగోలా చికిత్స పొంది కోలుకుంటున్నారు. కానీ పేదవారే వైరస్ బారిన పడితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందే అరకొర వైద్య సేవలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి అండగా బీమా కంపెనీలు నిలుస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో వైరస్ బారిన పడినా రూపాయి ఖర్చు లేకుండా చికిత్స పొంది కోలుకునే అవకాశం లభించింది. ఈ వైరస్ బారిన పడిన వారికి అయిన ఖర్చులు భరించేందుకు ఇన్సురెన్స్ రెగ్యులేటరీ (IRDAI) 29 బీమా కంపెనీలకు స్వల్పకాలిక కరోనా కవచ్ హెల్త్ ఇన్సురెన్స్ పాలసీలు ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో త్వరలోనే బీమా సంస్థలు ఆ కొత్త బీమా పాలసీలు ప్రారంభించనున్నాయి. ఆ పాలసీలు.. అర్హతలు.. ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసుకోండి..
స్వల్పకాలిక కరోనా కవచ్ హెల్త్ బీమా పాలసీని 29 జనరల్, ఆరోగ్య బీమా సంస్థలు శుక్రవారం ప్రారంభించాయి. సాధారణ ఆరోగ్య కవచ్, కరోనా రక్షక్ పేర్లతో పాలసీలను జూలై 10వ తేదీలోగా తీసుకురావాలని ఐఆర్డీఏఐ సూచించింది. ఇందుకు అనుగుణంగా హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్, మ్యాక్స్ బూపా, ఐసీఐసీఐ లాంబార్డ్, టాటా, భారతీ, ఓరియంటల్, బజాజ్, స్టార్ సహా 29 సంస్థలు పాలసీలతో ముందుకు వచ్చాయి.
పాలసీ రకాలు
- ఎక్కువ సంస్థలు కరోనా కవచ్ పేరుతో పాలసీలను విడుదల చేశాయి.
- పాలసీ తీసుకున్నప్పటికీ 15 రోజులు వేచి చూసిన తర్వాత పరిహారం చెల్లిస్తారు.
- వైరస్కు చికిత్స ఖర్చు బాధితులకు భారం కాకుండా పాలసీల్ని రూపొందించారు.
- ప్రీమియం శ్రేణి రూ.447 నుంచి రూ.5,630 మధ్య ఉంది. దీనికి జీఎస్టీ అదనం.
- ఈ పాలసీలు మూడున్నర నెలలు (105 రోజులు), ఆరున్నర నెలలు (195 రోజులు), తొమ్మిదిన్నర నెలలు (285 రోజులు) వ్యవధికి అందుబాటులో ఉన్నాయి. కాలం తీరిన తర్వాత పునరుద్ధరణ ఉండదు.
పాలసీకి అర్హతలు
- ఆన్లైన్ ద్వారా పాలసీ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ పాలసీల ప్రీమియం దేశవ్యాప్తంగా ఒకేలా ఉంటుంది.
- వ్యక్తుల వయసు, కాలపరిమితి ఆధారంగా ప్రీమియంలో మార్పులుంటాయి.
- 18-65 ఏళ్ల వయసు వారు అర్హులు.
- వ్యక్తిగతంగా, కుటుంబం అంతటికీ వర్తించేలా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు ఉన్నాయి.
- ఫ్యామిలీ ఫ్లోటర్ ఎంచుకుంటే పాలసీదారుపై ఆధారపడిన 3 నెలల నుంచి 25 ఏళ్ల వయసు ఉన్న పిల్లలను పాలసీలో చేర్పించవచ్చు.
- పాలసీలో చేరేందుకు ముందస్తు పరీక్షలు అవసరం లేదు.
- బీమా సంస్థలు ఏవైనా కరోనా రక్షక్, కరోనా కవచ్ పాలసీలు ఒకేలా ఉంటాయి.
- సంస్థలు తమ ఇష్టానుసారం ప్రీమియం నిర్ణయించుకోవచ్చు. పాలసీదారు వయసును బట్టి ప్రీమియం మారుతుంది.
ప్రత్యేక పాలసీ
- మూడున్నర నెలలు, ఆరున్నర నెలలు, తొమ్మిదిన్నర నెలల కాలవ్యవధితో ఈ పాలసీలను బీమా కంపెనీలు విక్రయిస్తాయి. కనీస బీమా రూ.50,000, గరిష్ఠ బీమా రూ.5లక్షలు(రూ.50 వేల చొప్పున) ఉంది. ఆప్షనల్ కవర్ను ఎంచుకోవచ్చు.
- ఆస్పత్రిలో చేరినప్పుడు పాలసీ విలువలో 0.5 శాతం చొప్పున 15 రోజుల పాటు చెల్లిస్తారు.
- చికిత్స చేయించుకున్నప్పుడు ఎలాంటి మినహాయింపులు లేకుండా అన్ని రకాల ఫీజులు, ఖర్చులకు పరిహారం అందుతుంది.
- ఇంట్లో ఉండి చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచిస్తే ఆ ఖర్చంతా బీమా సంస్థ చెల్లిస్తుంది. దీనికి రోజు వైద్య నివేదికలు, ఖర్చు వివరాలు సమర్పించాలి.
- ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో చికిత్స పొందితే నగదు రహిత చికిత్సకు అవకాశం ఉంది. లేదంటే సొంతంగా బిల్లు చెల్లించి బీమా సంస్థ నుంచి తిరిగి పొందవచ్చు.
- గరిష్టంగా 14 రోజులు అనుమతిస్తారు.
- ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన వైద్య విధానాల్లో చికిత్స తీసుకున్నా పాలసీ ద్వారా పరిహారం పొందవచ్చు.
- ఈ బీమా పాలసీని సాధారణ బీమా సంస్థలతో పాటు జీవిత బీమా సంస్థలు అందించేందుకు IRDAI అనుమతించింది. దీనిని బెనిఫిట్ పాలసీ అంటారు. కరోనా పాజిటివ్ తేలితే ఈ పాలసీ మొత్తాన్ని కొన్ని నిబంధనలకు లోబడి చెల్లిస్తారు.
- కనీస బీమా రూ.50,000 నుంచి రూ.2,50,000 వరకు
- పాజిటివ్ తేలాక 72 గంటలలోపు ఆస్పత్రిలో చేరి.. చికిత్స పొందితే ఈ పాలసీ విలువ మేరకు పరిహారం ఉంటుంది.
- రూ.2,50,000 పాలసీ తీసుకుంటే 72 గంటలు గడిచిన తర్వాత చికిత్స మొత్తంతో సంబంధం లేకుండా పాలసీ రూ.2,50,000 చెల్లిస్తుంది. ఆ తర్వాత పాలసీ రద్దవుతుంది.
స్వల్పకాలిక కరోనా కవచ్ హెల్త్ బీమా పాలసీని 29 జనరల్, ఆరోగ్య బీమా సంస్థలు శుక్రవారం ప్రారంభించాయి. సాధారణ ఆరోగ్య కవచ్, కరోనా రక్షక్ పేర్లతో పాలసీలను జూలై 10వ తేదీలోగా తీసుకురావాలని ఐఆర్డీఏఐ సూచించింది. ఇందుకు అనుగుణంగా హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్, మ్యాక్స్ బూపా, ఐసీఐసీఐ లాంబార్డ్, టాటా, భారతీ, ఓరియంటల్, బజాజ్, స్టార్ సహా 29 సంస్థలు పాలసీలతో ముందుకు వచ్చాయి.
పాలసీ రకాలు
- ఎక్కువ సంస్థలు కరోనా కవచ్ పేరుతో పాలసీలను విడుదల చేశాయి.
- పాలసీ తీసుకున్నప్పటికీ 15 రోజులు వేచి చూసిన తర్వాత పరిహారం చెల్లిస్తారు.
- వైరస్కు చికిత్స ఖర్చు బాధితులకు భారం కాకుండా పాలసీల్ని రూపొందించారు.
- ప్రీమియం శ్రేణి రూ.447 నుంచి రూ.5,630 మధ్య ఉంది. దీనికి జీఎస్టీ అదనం.
- ఈ పాలసీలు మూడున్నర నెలలు (105 రోజులు), ఆరున్నర నెలలు (195 రోజులు), తొమ్మిదిన్నర నెలలు (285 రోజులు) వ్యవధికి అందుబాటులో ఉన్నాయి. కాలం తీరిన తర్వాత పునరుద్ధరణ ఉండదు.
పాలసీకి అర్హతలు
- ఆన్లైన్ ద్వారా పాలసీ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ పాలసీల ప్రీమియం దేశవ్యాప్తంగా ఒకేలా ఉంటుంది.
- వ్యక్తుల వయసు, కాలపరిమితి ఆధారంగా ప్రీమియంలో మార్పులుంటాయి.
- 18-65 ఏళ్ల వయసు వారు అర్హులు.
- వ్యక్తిగతంగా, కుటుంబం అంతటికీ వర్తించేలా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు ఉన్నాయి.
- ఫ్యామిలీ ఫ్లోటర్ ఎంచుకుంటే పాలసీదారుపై ఆధారపడిన 3 నెలల నుంచి 25 ఏళ్ల వయసు ఉన్న పిల్లలను పాలసీలో చేర్పించవచ్చు.
- పాలసీలో చేరేందుకు ముందస్తు పరీక్షలు అవసరం లేదు.
- బీమా సంస్థలు ఏవైనా కరోనా రక్షక్, కరోనా కవచ్ పాలసీలు ఒకేలా ఉంటాయి.
- సంస్థలు తమ ఇష్టానుసారం ప్రీమియం నిర్ణయించుకోవచ్చు. పాలసీదారు వయసును బట్టి ప్రీమియం మారుతుంది.
ప్రత్యేక పాలసీ
- మూడున్నర నెలలు, ఆరున్నర నెలలు, తొమ్మిదిన్నర నెలల కాలవ్యవధితో ఈ పాలసీలను బీమా కంపెనీలు విక్రయిస్తాయి. కనీస బీమా రూ.50,000, గరిష్ఠ బీమా రూ.5లక్షలు(రూ.50 వేల చొప్పున) ఉంది. ఆప్షనల్ కవర్ను ఎంచుకోవచ్చు.
- ఆస్పత్రిలో చేరినప్పుడు పాలసీ విలువలో 0.5 శాతం చొప్పున 15 రోజుల పాటు చెల్లిస్తారు.
- చికిత్స చేయించుకున్నప్పుడు ఎలాంటి మినహాయింపులు లేకుండా అన్ని రకాల ఫీజులు, ఖర్చులకు పరిహారం అందుతుంది.
- ఇంట్లో ఉండి చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచిస్తే ఆ ఖర్చంతా బీమా సంస్థ చెల్లిస్తుంది. దీనికి రోజు వైద్య నివేదికలు, ఖర్చు వివరాలు సమర్పించాలి.
- ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో చికిత్స పొందితే నగదు రహిత చికిత్సకు అవకాశం ఉంది. లేదంటే సొంతంగా బిల్లు చెల్లించి బీమా సంస్థ నుంచి తిరిగి పొందవచ్చు.
- గరిష్టంగా 14 రోజులు అనుమతిస్తారు.
- ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన వైద్య విధానాల్లో చికిత్స తీసుకున్నా పాలసీ ద్వారా పరిహారం పొందవచ్చు.
- ఈ బీమా పాలసీని సాధారణ బీమా సంస్థలతో పాటు జీవిత బీమా సంస్థలు అందించేందుకు IRDAI అనుమతించింది. దీనిని బెనిఫిట్ పాలసీ అంటారు. కరోనా పాజిటివ్ తేలితే ఈ పాలసీ మొత్తాన్ని కొన్ని నిబంధనలకు లోబడి చెల్లిస్తారు.
- కనీస బీమా రూ.50,000 నుంచి రూ.2,50,000 వరకు
- పాజిటివ్ తేలాక 72 గంటలలోపు ఆస్పత్రిలో చేరి.. చికిత్స పొందితే ఈ పాలసీ విలువ మేరకు పరిహారం ఉంటుంది.
- రూ.2,50,000 పాలసీ తీసుకుంటే 72 గంటలు గడిచిన తర్వాత చికిత్స మొత్తంతో సంబంధం లేకుండా పాలసీ రూ.2,50,000 చెల్లిస్తుంది. ఆ తర్వాత పాలసీ రద్దవుతుంది.