పోసానిపై జనసేన నాయకురాలు నిహారిక సంచలన వ్యాఖ్యలు

Update: 2021-09-29 08:50 GMT
పవన్ కళ్యాణ్ వర్సెస్ పోసాని కృష్ణమురళి వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. వరుసగా రెండు రోజులుగా పోసాని ప్రెస్ మీట్లు పెట్టి.. పవన్ కళ్యాణ్ తోపాటు ఆయన ఫ్యామిలీని కూడా ఇందులోకి లాగడం.. ఆయన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడాన్ని చాలా మంది తప్పు పడుతున్నారు. పైగా ఈ వివాదంలోకి ఆడవాళ్లను కూడా లాగడంపై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నెటిజన్లు సైతం పోసానిని ప్రశ్నిస్తున్నారు.

ఇక ఇప్పటికే పోసాని వ్యాఖ్యలపై తెలంగాణ జనసేన ఇన్ చార్జి శంకర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పోసానిపై కేసు పెట్టారు. ఒకవైపు మెగా అభిమానులు సైతం పోసాని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మెగా బ్రదర్ నాగబాబు సైతం సోషల్ మీడియా వేదికగా పోసాని వ్యాఖ్యలకు వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చాడు.

ఈ క్రమంలోనే   పవన్ కళ్యాణ్ పై పోసాని చేసిన వ్యాఖ్యలను తెలంగాణ జనసేన మహిళా నాయకురాళ్లు ఖండించారు. తెలంగాణ జనసేన నాయకురాలు నిహారిక తాజాగా పోసానిపై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ‘రిపబ్లిక్’ సినిమా ఫంక్షన్ లో ఆడవాళ్ల గురించి ఒక్క మాట మాట్లాడలేదని.. జగన్ పై మాత్రమే కామెంట్స్ చేశాడని నిహారిక చెప్పుకొచ్చింది.

అయితే పోసాని మాత్రం ఇలా రియాక్ట్ అవుతున్నారని..ఆయనపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొంది. పోసానిపై   ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని నిహారిక డిమాండ్ చేసింది. అంతేకాకుండా పోసానిని మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలని సలహా ఇచ్చింది.
Tags:    

Similar News