అమ్మ డ్రైవర్ హత్య...ఎలా జ‌రిగింది?

Update: 2017-04-29 11:10 GMT
తమిళనాడు దివంగత ముఖ్య‌మంత్రి జయలలితకు సంబంధించి మ‌రో షాక్ లాంటి ప‌రిణామం తాజాగా చోటు చేసుకుంది. జ‌య‌ల‌లిత మాజీ డ్రైవర్ కనకరాజు అనుమానాస్పద స్థితిలో శ‌వ‌మై క‌నిపించాడు. సాలెం జిల్లాలోని అత్తూర్‌ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కనకరాజు మృతి చెందినట్లు పోలీసులు చెప్తున్న‌ప్ప‌టికీ కనకరాజును హత్య చేశారని జయలలిత మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఈ ప‌రిణామంపై లోతైన ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు.

జయలలితకు చెందిన ఎస్టేట్‌ లో ఈనెల 24వ తేదీన జరిగిన కాపలాదారుడి హత్య జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఘ‌ట‌న అనంత‌రం జయ ఆస్తులకు , అన్నాడీఎంకేకు చెందిన కీలక పత్రాల అపహరణకు కనకరాజు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తూ కనకరాజు కోసం గాలిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో పోలీసులకు డ్రైవ‌ర్ క‌న‌క‌రాజు శవమై కనిపించాడు. అయితే క‌న‌క‌రాజు మృతిపై సందేహాలు నెల‌కొంటున్నాయి. హ‌త్య జ‌రిగి ఉంటుంద‌ని అమ్మ అభిమానులు చెప్తున్నారు. ఈ నేప‌థ్యంలో కేసు సమగ్ర విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

కాగా, జ‌య‌ల‌లిత‌కు చెందిన వ్య‌క్తిగ‌త ఆస్తుల‌కు సంబంధించి ఇటీవ‌ల అనూహ్య‌మైన ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నారు. ఊటీలోని కొడనాడ్‌ లో జ‌య‌ల‌లిత‌కు చెందిన సుమారు వెయ్యికోట్ల విలువ గ‌ల 900 ఎకరాల ఎస్టేట్ వాచ్‌ మ‌న్ ఇటీవ‌లే హ‌త్య‌కు గురైన సంగ‌తి తెలిసిందే. ఇది జ‌రిగి వారం తిర‌గ‌క‌ముందే తాజాగా అమ్మ డ్రైవ‌ర్ హ‌త్య‌ ఉదంతం చోటుచేసుకుంది. కొద్ది రోజుల కిందట చెన్నై శివార్లలోని జయలలితకు చెందిన భవంతికి నిప్పుపెట్టి డాక్యుమెంట్లను దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. ఇలా వ‌రుస‌గా జ‌రుగుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో అస‌లేం జ‌రుగుతోంద‌నే చ‌ర్చ త‌మిళ‌నాడు వాసుల్లో జోరుగా వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News