బాలయ్య డైలాగ్ తో అందరి మైండ్ బ్లాంక్ చేసిన కేటీఆర్ కొడుకు

Update: 2022-11-15 04:25 GMT
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు గతంలో బరువు సమస్యల కారణంగా ఆన్‌లైన్‌లో ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. అతడి లావైన శరీరాకృతి కారణంగా బాడీ షేమింగ్‌కు గురయ్యాడు. కేటీఆర్ కూడా కొడుకు బరువు కారణంగా పలు సందర్భాల్లో ప్రభావితమయ్యారు.

తన కొడుకుపై రేవంత్ రెడ్డి విమర్శల గురించి  బహిరంగంగా మాట్లాడారు. తన కుమారుడిపై కొందరు అసభ్యకరమైన వ్యక్తులు ఎలా వ్యాఖ్యలు చేశారో ఆయన ప్రస్తావించారు.

అయితే విమర్శించిన వారికే షాకిచ్చేలా హిమాన్షు తయారయ్యాడు. హిమాన్షు ఎక్సర్ సైజులు చేసి మరీ స్లిమ్ అయ్యాడు. భారీ మేక్ఓవర్‌తో ట్రోలర్‌లను తిరిగి ట్రోల్ చేస్తున్నాడు.

తాజాగా ఒక సోషల్ మీడియా వినియోగదారు హిమాన్షు లేటెస్ట్ ఫొటోను పోస్ట్ చేసి అతను తన తండ్రి కేటీఆర్ చిన్న వెర్షన్‌లా కనిపిస్తున్నాడని రాశాడు. అది గమనించిన హిమాన్షు ట్విటర్‌లో రీట్వీట్ చేసి ప్రముఖ బాలకృష్ణ డైలాగ్‌తో రిప్లై ఇచ్చాడు. 'ఒక గొప్ప వ్యక్తి ఒకసారి చెప్పారు.. సరిసరిలే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతున్నాయా ఏంటి" అంటూ బాలయ్య డైలాగ్ ను హిమాన్షు ట్వీట్ చేశాడు.  'జోకులు వేరు.. ధన్యవాదాలు!" అంటూ ముగించాడు.

ఈ పోస్ట్‌ను చాలా మంది ఇష్టపడుతున్నారు. వారిలో కొందరు హిమాన్షు ఇంతలా సన్నబడడానికి.. తన అద్భుతమైన మేక్ఓవర్ వెనుక రహస్యాన్ని వెల్లడించమని కోరారు.

ఒక్కటి మాత్రం నిజం కెటిఆర్ మాత్రం తన కొడుకు ఇంతలా సన్నబడి స్మార్ట్ గా అవ్వడానికి గల కారణాలు వెతుకుతుంటాడు.  ఇప్పుడు గొప్ప షేప్‌లో కనిపిస్తున్నందున.. బరువు తగ్గిపోయినందుకు విమర్శకులకు తగిన సమాధానం ఇచ్చినందుకు ఆనందపడుతున్నట్టు ఉన్నాడు.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News