ఆ దేశానికి శుభ‌లేఖ తీసుకెళ్లిన వైగోకి షాక్‌

Update: 2017-06-09 09:42 GMT
త‌మిళ‌వాదాన్ని విప‌రీతంగా వినిపిస్తూ.. అతివాద వ్యాఖ్య‌ల్ని త‌ర‌చూ చేసే ఎండీఎంకే పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు వైగోకు ఊహించని షాక్ ఒక‌టి ఎదురైంది. శుభమా అని ఇంట్లో జ‌రుగుతున్న పెళ్లికి.. త‌న‌కు ప‌రిచ‌యం ఉన్న ప్ర‌ముఖుల్ని పిల‌వ‌టానికి వెళ్లిన ఆయ‌న‌కు.. మ‌లేషియా అధికారుల దెబ్బ‌కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది.

వైగో కుమార్తె వివాహం ఈ నెల 10న జ‌ర‌గ‌నుంది. దీనికి.. హాజ‌రు కావాలంటూ మ‌లేషియన్ స్టేట్ పెనాంగ్ డిప్యూటీ సీఎంకు శుభ‌లేఖ ఇచ్చేందుకు వైగో మలేషియాకు వెళ్లారు. శుభ‌లేఖ తీసుకెళుతున్న ఆయ‌న్ను కౌలాలంపూర్ విమానాశ్ర‌యంలో అధికారులు అడ్డుకున్నారు. ఆయ‌నకు మ‌లేషియాలోకి ప్ర‌వేశం లేదంటూ నిలువ‌రించారు. అక్క‌డితో ఆగ‌ని అధికారులు వైగోను తీసుకెళ్లి విచార‌ణ జ‌రిపారు.

కొన్ని గంట‌ల పాటు ఆయ‌న్ను నిర్బందించి విచారించిన వైనం ఇప్పుడు సంచ‌ల‌నంఆ మారింది. ఎల్టీటీఈ సంస్థ‌తో వైగోకు సంబంధాలు ఉన్నాయ‌న్న సందేహంతో మ‌లేషియ‌న్ అధికారులు ఆయ‌న్ను విచారిస్తున్నారు. శుభ‌మా అని శుభ‌లేఖ తీసుకొని వెళితే.. ఊహించ‌ని ప‌రిణామం వైగోకి ఎదురైందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News