టీ ఛానళ్లు గ్రాండ్ వెల్ కమ్ అని కన్ఫర్మ్ చేశాయి

Update: 2015-10-23 04:25 GMT
అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అపూర్వ స్వాగతం లభించటంపై తెలంగాణ ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా ఏపీ ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందన్న సందేహం వ్యక్తమైనప్పటికీ.. అశేషంగా తరలి వచ్చిన ఏపీ ప్రజలు.. కేసీఆర్ కనిపించిన సందర్భంలో కేరింతలు కొట్టటం విశేషం.

ఈ కారణంతోనే కావొచ్చు.. కేసీఆర్ సైతం బొకే చేతికి ఇచ్చిన సందర్భంగా.. ఉత్సాహంతో చేయి ఊపి అభివాదం చేయటం కనిపించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో ప్రతి దగ్గరా ప్రత్యేక జాగ్రత్త తీసుకోవటం.. తమకు అత్యంత ముఖ్యమైన అతిధి అన్నట్లుగా కేసీఆర్ పట్ల ప్రవర్తించటం స్పష్టంగా కనిపించింది.

ఈ కారణంతోనే కావొచ్చు.. తెలంగాణ టీవీ ఛానళ్లు.. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో కేసీఆర్ కు గ్రాండ్ వెలకమ్ ఇచ్చినట్లుగా పేర్కొన్నాయి. నిజానికి తెలంగాణ ఛానళ్లు మాత్రమే కాదు.. రాజధాని శంకుస్థాపన ఫాలో అయిన ప్రతి ఒక్కరూ కేసీఆర్ పట్ల ఏపీ సర్కారు.. ప్రజలు వ్యవహరించిన తీరు.. కురిపించిన ప్రేమాభిమానాలతో పిధా అయిపోయిన పరిస్తితి.
Tags:    

Similar News