ముస్లింలు పెరిగారు.. హిందువులు తగ్గారు

Update: 2015-08-26 04:24 GMT
ఇంతకాలం చర్చగా ఉన్న అంశం ఇప్పుడు అధికారిక గణాంకాలతో నిజమని తేలింది. దేశంలో మెజార్టీలుగా చెప్పే హిందువుల వృద్ధి రేటు తగ్గుముఖం పట్టిందని.. దేశంలోని మైనార్టీల వృద్ధి రేటు రోజురోజుకీ పెరుగుతుందన్న విషయం తాజాగా కేంద్ర సర్కారు విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

దేశంలో మతాల వారీగా జనాభా లెక్కలకు సంబంధించిన వివరాల్ని ప్రకటించారు. 2001 నుంచి 2011 మధ్య కాలంలో దేశంలోని వివిధ మతాల మధ్య జనాభా వృద్ధి రేటులో వచ్చిన మార్పును ఈ గణాంకాలు బయటపెట్టాయి. దేశంలో మెజార్టీలుగా చెప్పే హిందువుల వృద్ధి రేటు 0.7 శాతం తగ్గుదల నమోదు అయితే.. మైనార్టీలుగా భావించే ముస్లింల వృద్ధి రేటు 0.8 వృద్ధి చెందటం గమనార్హం.

2011 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశంలో మొత్తం జనాభా 121 కోట్లుగా లెక్క తేల్చారు. ఇందులో హిందువుల సంఖ్య 96.63 కోట్లు (వృద్ధి రేటు 16.8శాతం) . అంటే దేశ జనాభాలో 79.8శాతం. ఇక.. ముస్లింల జనాభా 17.22కోట్లు (వృద్ధి రేటు 24.6శాతం) . క్రైస్తవుల జనాభా 2.78 కోట్లు (15.5శాతం).. బౌద్ధులు 84 లక్షలు.. జైనులు 45 లక్షలు.. ఇతర మతాల వారు 79 లక్షలు అయితే.. ఏ మతానికి చెందని వారు 29 లక్షల మంది. దేశంలో మిగిలిన మతాల పెరుగుదలలో పెద్దగా మార్పు రాకపోవటం.. హిందువుల జనాభా వృద్ధి రేటు పడిపోతే.. వీటన్నింటికి భిన్నంగా ముస్లిం జనాభా దేశంలో పెరుగుదల నమోదు కావటం గమనార్హం.


Tags:    

Similar News