బాబుపై వర్మ సంచలన ఆరోపణలు.. వాళ్లనే మించి పోయాడుగా

Update: 2023-01-05 04:54 GMT
చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కాంక్షతో అమాయక ప్రజల ప్రాణాలను తీస్తున్నాడు అంటూ వైకాపా నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు వైకాపా నాయకులను మించి చంద్రబాబు నాయుడు పై వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చంద్రబాబు ను ఒక నరరూప రాక్షసుడు అంటూ వర్మ తీవ్రంగా స్పందించాడు.

చంద్రబాబు నాయుడు సభల సందర్భంగా జనాలు చనిపోవడం పై వర్మ ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో... కుక్కలకు బిస్కెట్లు వేసినట్లుగా జనాలకు చంద్రన్న కానుక పేరుతో బిస్కట్లు వేసి సభకు రప్పించుకున్నారు. చిన్న ఇరుగు సందుల్లో జనాలు తక్కువగా ఉన్నా కూడా ఎక్కువగా కనిపిస్తారు అనే ఉద్దేశ్యంతో అక్కడ కార్యక్రమం నిర్వహించారు.

ఒకటి రెండు చంద్రన్న కానుకలు ఇచ్చి ఫొటోలు దిగి అక్కడ నుండి వెళ్లి పోయిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత జరిగిన సంఘటన గురించి పట్టించుకోలేదు అంటూ వర్మ ఆరోపించాడు. కేవలం వ్యక్తిగత ప్రతిష్ట కోసమే చంద్రబాబు నాయుడు ఇలా చేస్తున్నాడని.. తన పబ్లిసిటీ కోసం ఎంత మంది చనిపోతే అంత మంచిది అన్నట్లుగా ఆయన భావిస్తున్నాడంటూ వర్మ పేర్కొన్నాడు.

సభలకు వస్తే మందు ఇస్తాం అంటూ మొదలు పెట్టింది చంద్రబాబు నాయుడే. జనాలు ఎంత మంది చనిపోతే అంత పాపులారిటీ పెరుగుతుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నాడు. అందుకే ఇలా వ్యవహరిస్తున్నాడు. ఇరుకు సందుల్లో సభ పెడితే ఏం జరుగుతుందో 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్న నీకు తెలియదా చంద్రబాబు అంటూ వర్మ ప్రశ్నించాడు.

ఇప్పటి వరకు సీఎంగా పలు పదవులు నిర్వహించారు అనే ఉద్దేశ్యంతో మీరు అంటూ సంభోదించాను. కానీ ఇక నుండి నువ్వు అనే మాట్లాడుతాను అని కూడా వర్మ పేర్కొన్నాడు. చంద్రబాబు నాయుడు ను హిట్లర్ మరియు ముస్సోరి తో వర్మ పోల్చితే షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. మరి వర్మ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View

Tags:    

Similar News