అధర్మం అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళినా అంతిమ విజయం న్యాయానిద

Update: 2022-09-17 12:46 GMT
ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తే కొన‌సాగాల‌ని.. ఆరు మాసాల్లో అభివృద్ధి చేసిన ఫ్లాట్ల‌ను రైతుల‌కు అప్ప‌గించాల‌ని.. మౌలిక స‌దుపాయాల‌ను కూడా క‌ల్పించాల‌ని.. రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన విష‌యం తెలిసిందే.

అయితే.. ఇన్నాళ్లు దీనిపై వేచి చూసిన ప్ర‌భుత్వం ఇప్పుడు ఆక‌స్మికంగా.. సుప్రీం కోర్టుకు వెళ్లింది. అమ‌రావ‌తిని నిర్మించ‌లేమ‌ని.. అంత డ‌బ్బు త‌మ‌ద‌గ్గ‌ర లేద‌ని.. పిటిష‌న్‌లో పేర్కొంది. మూడు రాజ‌ధానుల‌కే తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని.. ప్ర‌భుత్వ విధానాప‌ర‌మైన నిర్ణ‌యాల్లో కోర్టు జోక్యం చేసుకుంద‌ని.. పిటిష‌న్‌లో పేర్కొంది.

అయితే.. స‌ర్కారు ఇలా  కోర్టుకు వెళ్లడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఎక్కడికి వెళ్లినా చివరికి న్యాయమే గెలుస్తుందని ఆయన అన్నారు. రాజధానిపై హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం... సుప్రీంకోర్టుకు వెళ్లిన అంశం... "అధర్మం అంతర్జాతీయ కోర్టుకు వెళ్లినా... అంతిమ విజయం న్యాయానిదే" అని  నారా లోకేశ్‌ స్పష్టంచేశారు.

రాష్ట్రానికి అమరావతే రాజధాని అని 6 నెలల్లో అభివృద్ధి పనులు చేపట్టాలన్న హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. 3 రాజధానులు ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న విష‌యాన్నికూడా ప్ర‌స్తావించింది.

అమరావతే రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని సుప్రీం కోర్టును రాష్ట్ర ప్ర‌భుత్వం విజ్ఞప్తి చేసింది. హైకోర్టు తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనన్న రాష్ట్ర ప్రభుత్వం తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని కోరింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదనడం సరికాదని సీఆర్డీఏ చట్టం ప్రకారమే చేయాలనడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని పిటిషన్‌లో పేర్కొంది.

అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే 3 రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు పిటిషన్‌లో తెలిపింది. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించిందని... అది రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు తెలిపింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News