సోషల్ మీడియాలో స్నేహం.. ముగ్గురు డాక్టర్లు చేసిన దారుణం

Update: 2022-10-05 05:39 GMT
ప్రాణం పోసే వ్యక్తిగా వైద్యుడ్ని గుర్తిస్తారు. దేవుడికి సరిసమానంగా చూసే వైద్య వృత్తికే తలవంపులు తీసుకొచ్చారు ముగ్గురు వైద్యులు. ఆన్ లైన్ స్నేహాన్ని అసరా చేసుకొని.. అమాయకంగా నమ్మి వచ్చిన మహిలను దారుణంగా వంచించి.. గ్యాంగ్ రేప్ చేసిన ముగ్గురు డాక్టర్ల ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

ఉత్తరప్రదేశ్ లోని కొత్వాలి ప్రాంతంలో చోటు చేసుకున్న ఒక గ్యాంగ్ రేప్ తీవ్ర సంచలనంగా మారింది. కారణం.. ఈ రేప్ నకు పాల్పడింది ముగ్గురు వైద్యులు కావటమే. కొత్వాలి ప్రాంతంలో బస్తీ సదర్ ఆసుపత్రిలో వైద్యుడిగా పని చేస్తున్న ఒక వ్యక్తి.. సోషల్ మీడియా ద్వారా ఒక మహిళతో పరిచయం పెంచుకున్నాడు. టీచర్ గా పని చేసే సదరు మహిళ వైద్యుడి మాటల్ని నమ్మేసింది.

తమ స్నేహంలో భాగంగా తాను పని చేసే ఆసుపత్రికి రావాలని కోరింది. దీంతో.. ఆమె ఆసుపత్రి వద్దకు వెళ్లగా.. అక్కడ కాసేపు గడిపిన వారు.. ఆమెను తన హాస్టల్ వద్దకు తీసుకొచ్చాడు. తన గదిలోకి తీసుకెళ్లిన అతడు.. తన ఇద్దరు సహ వైద్యులతో కలిసి ఆమెపై ఆఘాత్యానికి పాల్పడ్డాడు.

ఊహించని షాక్ కు గురైన సదరు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెప్టెంబరు 27న జరిగిన ఈ దారుణం కాస్తంత ఆలస్యంగా బయటకు వచ్చింది.

నిందితులపై సదరు టీచర్ ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న పోలీసులు.. సదరు వైద్యుడ్ని అరెస్టు చేసినట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతం యూపీలో ఇప్పుడు సంచలనంగా మారింది. వైద్యులు సైతం ఇలాంటి ఆరాచకాలకు పాల్పడటమా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News