హైదరాబాద్‌లో భర్తతో సినిమాకెళ్లిన భార్య మిస్సింగ్‌!

Update: 2022-10-25 07:52 GMT
తన భర్తతో కలిసి సినిమాకు వెళ్లిన ఒక మహిళ కనిపించకుండా పోయిన ఘటన హైదరాబాద్‌లో కలకలం సృష్టించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లాకు చెందిన  భాస్కర్‌ రెడ్డి హైదరాబాద్‌లోని ఒక ప్రై వేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్‌ 21న సాయంత్రం భార్య శైలజతో కలిసి కొత్తగూడలోని ఏఎంబీ మాల్‌లో సినిమా చూడటానికి వచ్చాడు. సినిమా చూస్తుండగా మధ్యలో అతడి భార్య శైలజ వాష్‌రూమ్‌కు వెళుతున్నట్లు చెప్పి బయటికి వెళ్లి తిరిగి రాలేదు.

తన భార్య వాష్‌ రూమ్‌కు వెళ్లి చాలా సేపైనా తిరిగి రాకపోవడంతో భర్త భాస్కర్‌రెడ్డి కంగారుపడ్డాడు. వెంటనే థియేటర్‌ సిబ్బందితోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

థియేటర్‌లో మహిళా సిబ్బంది సినిమా హాల్లోని వాష్‌ రూమ్స్‌ మొత్తం వెతికినా వివాహిత జాడ దొరకలేదు. ఆ తర్వాత థియేటర్‌ పరిసర ప్రాంతాల్లోనూ గాలించారు. అయినా శైలజ ఆచూకీ లభించలేదు. ఆమె దగ్గర సెల్‌ఫోన్‌ కూడా లేకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏఎంబీ మాల్‌లోని íసీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

కాగా ఈ ఏడాది మే నెలలో శైలజతో భాస్కర్‌రెడ్డికి వివాహం జరిగింది. కాగా ఇటీవల వైజాగ్‌లో సాయి ప్రియ అనే మహిళ తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్తతో కలిసి రామకృష్ణ బీచ్‌కు వచ్చి తన ప్రియుడితో కలసి లేచిపోయిన సంగతి తెలిసిందే.

ఈ విషయం తెలియని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడం, చివరకు నేవీ పోలీసులు రంగంలోకి హెలికాఫ్టర్లతో బంగాళాఖాతంలో సైతం వెతుకులాట సాగించిన సంగతి విదితమే. చివరకు సాయిప్రియ తన ప్రియుడితో కలిసి పోలీసుల ముందు ప్రత్యక్షమైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News