విశాఖ వైసీపీకి రాచబాట‌

Update: 2021-11-17 08:20 GMT
ఇపుడు రెండు డివిజన్లకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే నగరం నడిబొడ్డున ఉన్న 31వ వార్డును గెలుచుకోవడం.

నిజానికి ఇది టీడీపీకి కంచుకోట. అనేక సార్లు టీడీపీ ఇక్కడ సత్తా చాటింది. అలాంటి చోట వైసీపీ విజయం సాధించడమే వెరీ స్పెషల్. వాస్తవానికి మొదట వైసీపీ పోటీకి దిగలేదు. చివరి నిముషంలో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి బీఫారం ఇచ్చి ప్రచారం చేసింది.

అయినా సరే అక్కడ వైసీపీ గెలవడం విశేషం. అలా టీడీపీ కంచుకోట చేజారిపోయింది. ఇక 61వ వార్డులో జరిగిన ఉప ఎన్నికల్లో తన సీటుని వైసీపీ నిలబెట్టుకుంది.

తాజాగా జరిగిన ఉప ఎన్నికల ద్వారా వైసీపీ అదనంగా మరో కార్పోరేట్ సీటు కైవశం చేసుకుని జీవీఎంసీలో బలం పెంచుకుంది. మొత్తానికి విశాఖ టీడీపీకి కంచుకోట అన్నది నిన్నటి మాట. వైసీపీకి రాచబాట అన్నది నేటి మాటగా చెబుతున్నారు.


Tags:    

Similar News