సూపర్‌ అప్‌డేట్ ఇచ్చిన కొత్త రాధిక

లిల్లీ పాత్రలో మరో రాధిక అన్నట్లు భలే ఆకట్టుకుంది.

Update: 2024-04-04 06:19 GMT

డీజే టిల్లు సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి రాధిక పాత్రలో ఏ స్థాయిలో అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పాత్ర క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ నటించింది. లిల్లీ పాత్రలో మరో రాధిక అన్నట్లు భలే ఆకట్టుకుంది.


చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్‌ ఏదో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్న అనుపమ పరమేశ్వరన్‌ త్వరలో జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్ కేరళ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ లీగల్‌ థ్రిల్లర్ లో నటనకు ఆస్కారం ఉన్న పాత్రను టిల్లు గాడి రాధిక చేసినట్లు తెలుస్తోంది.

తాజాగా జానకి వర్సెస్ స్టేట్‌ ఆఫ్ కేరళ సినిమా యొక్క డబ్బింగ్‌ ను పూర్తి చేసినట్లుగా అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటన చేసింది. హీరోయిన్‌ గా ఈ అమ్మడి జోరు చూస్తూ ఉంటే రెండు మూడు నెలలకు ఒకటి చొప్పున ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూనే ఉంది.

సురేష్‌ గోపి ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి ప్రవీణ్‌ నారాయణ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమాతో అనుపమ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.

Tags:    

Similar News