సూపర్‌ హిట్‌ సినిమా సిరీస్ లో '3' రాబోతుంది

Update: 2022-04-14 00:30 GMT
సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్‌ లు చేయడం ఈమద్య కాలంలో చాలా కామన్‌ విషయం గా మారింది. సీక్వెల్‌ కూడా సక్సెస్ అయితే అది ఒక ప్రాంచైజ్ గా బ్యాక్ టు బ్యాక్ మూడు నాలుగు పార్ట్‌ లు గా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. బాలీవుడ్‌ లో ఈ పరిణామం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. బాలీవుడ్ లో సూపర్‌ హిట్‌ అయిన సింగం సినిమాకు వరుసగా ప్రాంచైజ్‌ సినిమాలు వస్తున్నాయి.

ఇప్పటికే రెండు పార్ట్ లు సింగం వచ్చింది. ఇప్పుడు మూడవ పార్ట్‌ కు రెడీ అవుతున్నట్లుగా సింగం హీరో అజయ్ దేవగన్ ప్రకటించాడు. ఆయన హీరోగా వచ్చిన మొదటి రెండు సింగం సినిమా లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే మూడవ సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెట్టినట్లుగా ఇటీవల హీరో అజయ్ దేవగన్ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ప్రకటించాడు.

ఆయన నటించిన ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో ఆయన పాత్ర పై చాలా అంచనాలు పెట్టుకుని అభిమానులు చూశారు. కాని సినిమా సూపర్‌ హిట్‌ అయినా అజయ్ దేవగన్ అభిమానులు ఒకింత అసంతృప్తికి లోను అయ్యేలా ఆయన స్క్రీన్‌ స్పేస్ ఉంది. చాలా తక్కువ సమయం మాత్రమే కనిపించాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ సమయంలోనే ఆయన నటించిన రన్‌ వే 34 సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోగా నటించిన ఆ సినిమా కు సంబంధించిన ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశారు. అమితాబచ్చన్‌ కీలక పాత్రలో నటించిన రన్‌ వే 34 సినిమాను ఈద్‌ సందర్బంగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత సింగం ఉంటుందని అజయ్ దేవగన్ ప్రకటించాడు.

రన్ వే 34 సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా అజయ్ దేవగన్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు. సింగం నుండి మూడవ సిరీస్ ను త్వరలోనే మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించాడు.

సింగం 3 కి రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహిస్తాడని అజయ్ తెలియజేశాడు. భారీ అంచనాలున్న సింగం 3 ని ఎప్పటిలాగే పక్కా కమర్షియల్‌ పోలీస్ స్టోరీగా రూపొందించే అవకాశం ఉంది. అజయ్ దేవగన్ అభిమానులు ఇప్పటి నుండే సింగం 3 కోసం వెయిట్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News