ప్రభాస్‌.. పవన్ అన్‌ స్టాపబుల్‌ ఎపిసోడ్స్ పై 'ఆహా' హోప్స్‌

Update: 2022-12-23 09:33 GMT
తెలుగులో మొదటి ఓటీటీ 'ఆహా' తక్కువ సమయంలోనే అత్యధిక ఖాతాదారులను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆహా ఓటీటీ మొదట్లో చిన్న సినిమాలు మరియు సిరీస్‌ లను అందించింది. కానీ ఇప్పుడు రియాల్టీ షోలు.. కామెడీ షోలతో పాటు టాక్ షో లను కూడా ఆహా ద్వారా ప్రేక్షకులకు అందిస్తున్నారు.

అల్లు అరవింద్ సారధ్యంలో సాగుతున్న ఆహా ఓటీటీ కి బాలకృష్ణ హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న అన్‌ స్టాపబుల్‌ షో ద్వారా మరింత పాపులారిటీ దక్కింది. సీజన్ 2 ద్వారా మరింత మందికి చేరువ అవ్వాలనే ఉద్దేశ్యంతో గెస్ట్‌ ల విషయంలో అల్లు అరవింద్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఈ సీజన్‌ ఆరంభంను చంద్రబాబు నాయుడు తో మొదలు పెట్టాలని సూచించింది అల్లు అరవింద్ అనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ప్రభాస్ మరియు గోపీచంద్‌ కలిసి వచ్చిన విషయం తెల్సిందే. ప్రభాస్ ఈ షో కు హాజరు అవ్వడం వెనుక కూడా అల్లు అరవింద్ ఉన్నాడనే విషయం ప్రచారం జరుగుతోంది.

ఇక బాలయ్య అన్‌ స్టాపబుల్‌ షో లో పవన్ కళ్యాణ్ పాల్గొనే విషయంలో కూడా అల్లు అరవింద్ కీలక పాత్ర పోషిస్తున్నాడట. మొత్తానికి ప్రభాస్ మరియు పవన్ కళ్యాణ్ ల ఎపిసోడ్‌ లతో ఈ సీజన్ ను బెస్ట్‌ గా మార్చడంతో పాటు మరింత మంది ఖాతాదారులను చేర్చుకునేలా అల్లు అరవింద్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు.

ప్రభాస్ ఎపిసోడ్‌ ఈనెల చివర్లో స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఇక పవన్‌ కళ్యాణ్ గెస్ట్‌ గా రాబోతున్న ఎపిసోడ్‌ ను ఈ సీజన్ చివరి ఎపిసోడ్‌ గా స్ట్రీమింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇద్దరి ఎపిసోడ్స్‌ తో ఆహా స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంది.

అన్ స్టాపబుల్‌ మాత్రమే కాకుండా కామెడీ స్టాక్ ఎక్సేంజ్ కార్యక్రమంతో కూడా ఆహా ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇంకా కొత్త సినిమాలు.. కాన్సెప్ట్ బేస్డ్‌ సినిమాలు మరియు సిరీస్ లతో అలరిస్తూ ఆకట్టుకుంటూ ఆహా దూసుకు పోతుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News