'పృథ్వీరాజ్' టీజర్: 'హిందూస్తాన్ కా షేర్' వచ్చేస్తున్నాడు..!

Update: 2021-11-15 09:42 GMT
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో దూకుడు చూపిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 'బెల్ బాటమ్' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన అక్షయ్.. ఇటీవలే 'సూర్యవంశీ' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈ క్రమంలో ''పృథ్వీరాజ్'' అనే మరో చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశారు. కరోనా పరిస్థితుల వల్ల ఆలస్యమైన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామాని 2022 జనవరి 21న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్ ను చిత్ర బృందం ఆవిష్కరించింది.

భారతదేశపు ధైర్యవంతులైన చక్రవర్తుల్లో ఒకరైన పృథ్వీరాజ్ చౌహాన్ జీవితానికి సంబంధించిన కథతో ''పృథ్వీరాజ్'' సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అక్షయ్ కుమార్ ను శౌర్యవంతుడైన వీర చక్రవర్తిగా.. 'హిందూస్తాన్ కా షేర్' గా ప్రెజెంట్ చేశారు. మాజీ మిస్ ఇండియా మానుషి చిల్లర్ ఈ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తున్నారు. ఆమె సంయోగిత అనే పాత్రలో కనిపిస్తోంది. సంజయ్ దత్ - సోనూ సూద్ - అశుతోష్ రానా - మానవ్ విజ్ - సాక్షి తణ్వార్ కీలక పాత్రలు పోషించారు.

నేను కర్తవ్యం కోసం జీవించాను.. దాని కోసమే చనిపోతాను అంటూ క్రూరమైన మహమ్మద్ ఘోరీతో  సామ్రాట్ పృథ్వీరాజ్ ధైర్యంగా పోరాడుతున్నట్లు చూపించారు. భారీ వార్ సీక్వెన్స్ తో కూడిన ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఈ చిత్రానికి శంకర్ ఇషాన్ లాయ్ సంగీతం సమకూరుస్తుండగా.. మనుష్ నందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

''పృథ్వీరాజ్'' చిత్రానికి చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ''ఇది పృథ్వీరాజ్ చౌహాన్ వీరత్వానికి మరియు అతని పరాక్రమ జీవితానికి మా నివాళి. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ పాత్ర పోషించడం గర్వంగా ఉంది. వచ్చే జనవరి 21న మీకు సమీపంలో ఉన్న పెద్ద స్క్రీన్ లో 'పృథ్వీరాజ్' ను వీక్షించండి'' అని ఈరోజు టీజర్ లాంచ్ సందర్భంగా హీరో అక్షయ్ కుమార్ పేర్కొన్నారు.







Full View

Tags:    

Similar News