అలియాభ‌ట్‌.. కియారా.. తెలుగు సినిమా

Update: 2022-02-16 09:33 GMT
`బాహుబ‌లి` వంటి సంచ‌ల‌న చిత్రంతో తెలుగు సినిమా అంటే దేశ వ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. మార్కెట్ స్థాయి కూడా రికార్డు స్థాయికి చేరింది. దీంతో ప్ర‌తీ ఒక్క‌రూ ఇప్ప‌డు టాలీవుడ్ అంటే ఆస‌క్తిని చూపించ‌డం మొద‌లైంది. ఇక `బాహుబ‌లి` త‌రువాత రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. ఈ మూవీ మార్చి 25న వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ చిత్రం కార‌ణంగా బాలీవుడ్ హీరోయిన్ ల దృష్టి టాలీవుడ్ పై ప‌డింది.

ఈ మూవీ కారణంగా బాలీవుడ్ హీరోయిన్ లు టాలీవుడ్ సినిమాల్లో న‌టించ‌డానికి అమితాస్త‌ని చూపిస్తున్నారు. `ఆర్ ఆర్ ఆర్‌` ద్వారా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియా భ‌ట్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ త‌రువాత కూడా తెలుగులో మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ని సొంతం చేసుకుని టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది అలియా భ‌ట్. గ‌తంలో టాలీవుడ్ మేక‌ర్స్ కియారా అద్వానీ కోసం ఎదురు చూసేవారు. కానీ అలియా భ‌ట్ ఎంట్రీతో సీన్ మారిపోయింది.

కియారాకి ప్రాధాన్య‌త త‌గ్గిపోయింది. ఇప్పుడు ఏ డైరెక్ట‌ర్ నోట విన్నా.. ఏ స్టార్ ప్రొడ్యూస‌ర్ నోట విన్నా ఒక‌టే మాట అలియా భ‌ట్. అంత‌లా అలియా పేరు టాలీవుడ్ లో మారు మ్రోగిపోతోంది. తెలుగులో కియారా అద్వానీ ఇప్ప‌టి వ‌ర‌కు రెండు చిత్రాల్లో న‌టించింది. మ‌హేష్ తో `భ‌ర‌త్ అనే నేను`, రామ్ చ‌ర‌ణ్ తో `విన‌య విధేయ రామ‌` చిత్రాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం శంక‌ర్ డైరెక్ష‌న్ లో రామ్ చ‌ర‌ణ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ చేస్తోంది.

అయినా కియారా అంటే టాలీవుడ్ లో క్రేజ్ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదే స‌మ‌యంలో `ఆర్ ఆర్ ఆర్‌` తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న అలియా భ‌ట్ వెంట ప‌డుతున్నారు మ‌న స్రొడ్యూస‌ర్స్. ఈ మూవీ త‌రువాత వెంట‌నే తెలుగులో మ‌రో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో న‌టించే అవ‌కాశాన్ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ 30 వ చిత్రంగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించ‌బోతున్నారు. యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో మిక్కినేని సుధాక‌ర్ ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు.

అలియా భ‌ట్ కార‌ణంగా ఈ మూవీ లాంచింగ్ ఇటీవ‌ల పోస్ట్ పోన్ అయిందంటూ వార్త‌లు వినిపించిన విష‌యం తెలిసిందే. అలియా త‌రువాత దీపికా ప‌దుకునే తెలుగు హీరోల‌కు గాలం వేస్తోంది.

ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న `ప్రాజెక్ట్ కె`తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవుతున్న దీపిక ఈ మూవీ త‌రువాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల‌తో న‌టించాల‌ని వుంద‌ని ఇటీవ‌ల `గెహ్రైయాన్` మూవీ ప్ర‌మోష‌న్స్ లో ఓ మీడియాతో మాట్లాడుతూ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం అలియా వెంట ప‌డుతున్న మ‌న వాళ్లు ఆ త‌రువాత దీపిక వెంట ప‌డ‌తారెమో చూడాలి అంటున్నారు.
Tags:    

Similar News