పేపర్ బాయ్ కి గీతా ఆర్ట్స్ బ్యాకప్!

Update: 2018-08-26 05:49 GMT
ఈమధ్య ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ తో ఆసక్తి రేకెత్తించిన స్మాల్ బడ్జెట్ సినిమా 'పేపర్ బాయ్.'  డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాను సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మించగా జయ శంకర్ ఈ సినిమాతో టాలీవుడ్లోకి దర్శకుడిగా అడుగుపెడుతున్నాడు.   ఈ సినిమాను ఆగష్టు 31 న విడుదల చేసేందుకు ఫిలిం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను బాగుందని సూపర్ స్టార్ మహేష్ బాబు మెచ్చుకున్న విషయం తెలిసిందే.

తాజాగా సంపత్ నంది ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ నిర్మాతలు అల్లు అరవింద్ -బన్నీ వాస్ డైరెక్టర్ మెహర్ రమేష్ లకు ఏర్పాటు చేశాడట.  సినిమా చూసిన తర్వాత ఇంప్రెస్ అయిన అల్లు అరవింద్ ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రిలీజ్ చేసేందుకు నిర్ణయించుకొని టోటల్ థియేట్రికల్ రైట్స్ తీసుకున్నారట.  ఈ విషయాన్ని సంపత్ నంది తన ట్విట్టర్ ఖాతా ద్వారా ధ్రువీకరించాడు.  గీతా ఆర్ట్స్ టీం తమ సినిమా కంటెంట్ - డైలాగ్స్ - నటీనటుల పెర్ఫార్మన్స్ ను మెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉందని సంపత్ ట్విట్టర్ లో తెలిపాడు.

'గీత గోవిందం' జోష్ లో ఉన్న గీతా ఆర్ట్స్ బ్యానర్ నుండి వెంటనే మరో సినిమా అంటే ఆటోమేటిక్ గా 'పేపర్ బాయ్' పై మరింతగా హైప్ పెరగడం ఖాయం.  ఈ సినిమాలో సంతోష్ శోభన్ - రియా సుమన్ - తాన్యా హోప్ లు లీడ్ యాక్టర్లుగా నటించారు. భీమస్ సిసిరియోలో ఈ సినిమాకు సంగీత దర్శకుడు. 
Tags:    

Similar News