బన్నీ.. ఏందయ్యా ఈ మోత!

Update: 2017-05-30 11:14 GMT
అల్లు అర్జున్ ఫాలోయింగ్ గత కొన్నేళ్లలో ఏ రేంజిలో పెరిగిందో ‘దువ్వాడ జగన్నాథం’ రుజువు చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఏ విశేషాన్ని సోషల్ మీడియాలో చేసినా.. సంచలనమవుతోంది. ఇప్పటికే ‘దువ్వాడ జగన్నాథం’ టీజర్ ఏ స్థాయిలో ప్రకంపనలు రేపుతోందో తెలిసిందే. తెలుగులో ఏ టీజర్‌ కూ లేని స్థాయిలో దీనికి 1.5 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ మధ్య ‘డీజే’లో శరణం భజే అంటూ సాగే పాటను రిలీజ్ చేస్తే దానికి భారీగా వ్యూస్ వచ్చాయి. తాజాగా ‘గుడిలో బడిలో మదిలో’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ వీడియో టీజర్ వదిలితే.. అది యూట్యూబ్ లో దుమ్ము దులిపేస్తోంది.

24 గంటల్లోపే ఈ పాట 2 మిలియన్ వ్యూస్ మార్కును దాటేయడం విశేషం. ఇప్పటికే 22 లక్షల మంది దాకా చూశారు ఈ పాటను. దేవిశ్రీ ఎంటర్టైనింగ్ ట్యూన్ కు అల్లు అర్జున్.. పూజా హెగ్డే కలిసి అదిరిపోయే స్టెప్పులు వేయడంతో ఈ పాట ఇన్ స్టంట్ గా హిట్టయిపోయింది. పాట చిత్రీకరణలో హరీష్ శంకర్ స్టయిల్ కూడా కనిపిస్తోంది. పూజా గ్లామర్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విశేషం ఏంటంటే.. ‘దువ్వాడ జగన్నాథం’ ఫస్ట్ టీజర్ రిలీజైనపుడు అదే పనిగా డిజ్ లైక్స్ తో మోత మోగించిన యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు సైలెంటైపోయారు. ‘గుడిలో బడిలో..’ పాటకు ఇప్పటిదాకా 12 వేల డిజ్ లైక్సే వచ్చాయి. లైక్స్ 60 వేల దాకా ఉన్నాయి. ‘డీజే..’ టీజర్ కు 1.7 లక్షల దాకా డిజ్ లైక్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News