ఆగస్టు 11 రేసులో అల్లు హీరో

Update: 2017-08-02 05:02 GMT
ముందుగా తమిళ సినిమా వారు భలే ప్లానింగ్ చేస్తుండే వారు. వాళ్ళ సినిమాలను డబ్ చేసి ఇక్కడ రిలీజ్ చేసి హిట్లు కొట్టేవారు. మన సినిమాలు అటెళ్లడం చాలా అరుదుకాని.. మణిరత్నం.. శంకర్.. కమల్ హాసన్ సినిమాలన్నీ ఇటొచ్చేసి రచ్చ చేసేవి. ఇక తెలుగు సినిమాలను తమిళంలో ఆడించడం ఏమో కాని.. మనోళ్ళు మాత్రం మలయాళంలో బాగానే పాగా వేస్తున్నారు.

తెలుగు స్టార్లలో అల్లు అర్జున్ సినిమాలు మలయాళం కూడా విడుదల అవుతూ ఉంటాయి. కేరళలో అల్లు అబ్బాయికి మంచి క్రేజ్ ఉంది. అతని డాన్స్ తో అక్కడ అభిమానులును మంచిగానే అలరిస్తున్నాడు. అర్జున్ కొత్త సినిమా దువ్వాడ జగన్నాధం కూడా కేరళ లో విడుదలకు సిద్దంకాబోతుంది. ముందు ఈ మలయాళం డి‌జే సినిమా జూలై 14 నాడు విడుదల చేద్దాం అనుకున్నారు కానీ సెన్సార్  పనులు కొంచెం  ఆలస్యం కావడం వలన అనుకున్న తేదిలో కాకుండా ఆగష్టు 11 న విడుదల చేస్తున్నారు. సెన్సార్ పనులు పూర్తి కావడంతో ఇప్పుడు ఈ ఇండిపెండెన్స్ డే వీకెండ్ ను మిస్సవబోము అని చెబుతున్నారు దువ్వాడ జగన్నాధం టీమ్. దువ్వాడ జగన్నాధం సినిమా ప్రచారం అక్కడ జోరుగానే సాగుతుంది. ఈ సినిమాను సాధ్యమైనంత ఎక్కువ థియేటర్ల లో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తునట్లు తెలుస్తుంది. తెలుగులో మిక్స్ డ్   రిజల్ట్ తెచ్చుకున్న ఈ సినిమా అక్కడ ఏం చేస్తుందో చూడాలి.

హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అల్లు అర్జున్ తో పాటుగా ఇప్పుడు పూజా హెగ్డే కూడా మలయాళం సినిమా ఇండస్ట్రి లో మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందట. చూద్దాం వీరి అంచనాలు ఫలిస్తాయో లేదో.
Tags:    

Similar News