వైకుంఠపురం లో పార్టీలకు వేలాయర

Update: 2020-01-28 05:34 GMT
అల్లు అర్జున్‌.. త్రివిక్రమ్‌ లు హ్యాట్రిక్‌ కొట్టారు. అంతే కాకుండా అల్లు అర్జున్‌ ఇండస్ట్రీ హిట్‌ కొట్టాడు. నాన్‌ బాహుబలి రికార్డును దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఉన్న యంగ్‌ స్టార్‌ హీరోలు అంతా కూడా ఏదో ఒక సమయంలో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన వారే. కాని బన్నీ మాత్రమే ఇన్నాళ్లు ఇండస్ట్రీ హిట్‌ దక్కించుకోలేక పోతున్నాడు అనుకున్నారు. ఆ లోటును అల వైకుంఠపురంలో చిత్రంతో బన్నీ కొట్టి పారేశాడు. ఈ చిత్రానికి చినబాబు మరియు అల్లు అరవింద్‌ లు నిర్మాతలు అనే విషయం తెల్సిందే. కేవలం థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారానే నిర్మాతలకు దాదాపుగా 50 కోట్ల వరకు లాభాలు వచ్చి ఉంటాయంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అల్లు అర్జున్‌ ఏ చిన్న అకేషన్‌ అయినా.. ప్రతి సక్సెస్‌ కు కూడా పెద్దగా పార్టీలు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అలాగే అల వైకుంఠపురంలో సినిమాకు సంబంధించిన పార్టీల విషయమై నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇన్ని రోజులు సినిమా ప్రమోషన్స్‌ తో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. ఈ శనివారం బయ్యర్లకు పార్టీ ఇవ్వబోతున్నాము. ఆ తర్వాత వరుసగా స్నేహితులు మరియు ఫిల్మ్‌ స్టార్స్‌ ఇంకా మీడియా వారికి పార్టీ ఇవ్వబోతున్నట్లుగా బన్నీ ప్రకటించాడు.

ఇప్పటికే సుకుమార్‌ సినిమా రెండవ షెడ్యూల్‌ ను బన్నీ ప్రారంభించాల్సి ఉండగా అల వైకుంఠపురం లో సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ కోసం బన్నీ ఆ సినిమాను కాస్త ఆలస్యం చేయమంటూ సుకుమార్‌ కు రిక్వెస్ట్‌ చేశాడట. అతి త్వరలోనే అల వైకుంఠపురంలో సక్సెస్‌ నేపథ్యం లో బన్నీ వరుస పార్టీలు ఇవ్వబోతున్నాడు. బన్నీ పార్టీ కోసం చాలా మంది ఆయన సన్నిహితులు మీడియా మిత్రులు ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News