చిరంజీవి చూశాకే ఫైనల్ కటింగ్

Update: 2016-11-28 11:30 GMT
రామ్ చరణ్ కు ఇప్పుడు అర్జంటుగా మాంచి హిట్ అవసరం. మాస్ అభిమానుల్లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా.. కొన్నేళ్లుగా చరణ్ స్థాయిలో హిట్ పడకపోవడంతో.. రేస్ లో వెనకబడిపోతున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ సారి యాక్షన్ జోనర్ లో థ్రిల్లర్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉండే కాన్సెప్ట్ ని స్పెషల్ ఎంచుకుని మరీ చేశాడు చరణ్.

ఇప్పటికే ధృవ సెన్సార్ కూడా పూర్తయిపోయినా.. ప్రస్తుతం ఈ టీంని ఓ సమస్య వెంటాడుతోంది. ధృవకు సెన్సార్ చేయించిన రన్ టైం 164 నిమిషాలు. థ్రిల్లర్ మూవీకి ఇంత డ్యురేషన్ అంటే బాగా రిస్కీ వ్యవహారం. ఎక్కడ పట్టు తప్పినా.. అది రిజల్ట్ విషయంలో తేడా కొట్టేస్తుంది. అయితే.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేలో ఎక్కడ కట్ చేయాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ సమస్యను చిరంజీవి దగ్గరకు తీసుకెళ్తే.. స్పెషల్ స్క్రీనింగ్ లో చూసి సూచనలు చేస్తానని చెప్పారట ఆయన. త్వరలో చిరంజీవి కోసం ప్రత్యేకంగా ధృవను ప్రదర్శించనుండగా.. చిరు సలహాల మేరకు లెంగ్త్ ను కట్ చేయాలని డిసైడ్ అయ్యాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.

ఈ యాక్షన్ థ్రిల్లర్ ను 150 నిమిషాలకు పరిమితం చేయాలన్నది టార్గెట్ అని తెలుస్తోంది. పకడ్బందీ ఎంటర్టెయినింగ్ స్క్రీన్ ప్లే విషయంలో చిరుది అందె వేసిన చెయ్యి. అందుకే తుది నిర్ణయం ఆయనకు వదిలేశారు. అయితే..మూవీలో ఎంటర్టెయిన్మెంట్ పాళ్లు తక్కువగా ఉండడాన్ని చిరు క్వశ్చన్ చేస్తారనే డౌట్ పట్టుకుందిట. మరి చిరు ఏమంటారు.. ఏం చేస్తారనే విషయం రెండు రోజుల్లో తెలిసిపోనుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News