శంక‌ర్ శిష్యుడి సంచ‌ల‌న‌ బ‌యోపిక్ రాబోతోందా?

Update: 2022-11-08 01:30 GMT
ద‌ర్శ‌కుడు శంక‌ర్ శిష్యులు ఈ మ‌ధ్య సంచ‌ల‌న సినిమాల‌ని తెర‌పైకి తీసుకొస్తూ సంచ‌ల‌నం సృష్టిస్తున్నారు. ప్ర‌స్తుతం మ‌రో శిష్యుడు ద‌ర్శ‌కుడిగా మార‌బోతున్నాడు. ఇందు కోసం వివాదాస్ప‌ద వ్య‌క్తి బ‌యోపిక్ ని ఎంచుకోబోతున్నాడ‌ని తెలిసింది. శంక‌ర్ వ‌ద్ద శివాజీ, అప‌రిచితుడు, 2.0 వంటి సంచ‌ల‌న సినిమాల‌కు వ‌ర్క్ చేసిన కార్తీక్ త్వ‌ర‌లో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. అది కూడా కింగ్ ఫిష‌ర్ అధినేత, బ్యాంకుల‌కు వేల కోట్లు ఎగ‌వేసి లండ‌న్ లో దాక్కుంటున్న విజ‌య్ మాల్యా జీవిత క‌థ ఆధారంగా ఈమూవీని తెర‌పైకి తీసుకురానున్నార‌ట‌.

అయితే ఈ బ‌యోపిక్ లో విజ‌య్ మాల్యా త‌ర‌మాలో బ్యాంకుల‌కు వేల కోట్లు ఎగ‌వేసి విదేశాలు పారిపోయిన నీర‌వ్ మోదీ, మోహుల్ చోక్సీల జీవితాల్లో జ‌రిగిన ఆస‌క్తిక‌ర మ‌లుపులు, వారు చేసిన మోసాల‌ని ప్ర‌ధానంగా ఈ మూవీలో చ‌ర్చించ‌నున్నార‌ట‌. ఈ మూవీలో విజ‌య్ మాల్య తో పాటు నీర‌వ్ మోదీ, మోహుల్ చోక్సీల జీవితాల్లో జ‌రిగిన ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌ల‌ని, జ‌రిగిన మోసాల‌ని తెర‌పైకి తీసుకురానున్నార‌ట‌.

ఇక ఈ మూవీలోని విజ‌య్ మాల్యా పాత్రలో బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ ని ఎంచుకోవాల‌ని ద‌ర్శ‌కుడు కార్తీక్ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం అనురాగ్ తో ద‌ర్శ‌కుడు కార్తీక్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. ఈ బ‌యోపిక్ లో విజ‌య్ మాల్యా రియ‌ల్ లైఫ్ పై ప్ర‌ధాన ఫోక‌స్ వుండ‌నుంద‌ని, హీరోయిన్ లు, మోడ‌ల్స్ తో విజ‌య్ మాల్యా చేసిన జ‌ల్సా, ప్ర‌త్యేక పార్టీలు తెర‌పై చూపించ‌నున్నార‌ట‌.

అయితే ఈ పాత్ర‌కు అనురాగ్ క‌శ్య‌ప్ అయితేనే బాగుంటుద‌ని భావించిన ద‌ర్శ‌కుడు కార్తీక్ అత‌నితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. అనురాగ్ తో చ‌ర్చ‌లు పూర్త‌యితే విజ‌య్ మాల్యా పాత్ర కు సంబంధించిన లుక్ టెస్ట్ ని కూడా నిర్వ‌హించ‌నున్నార‌ట‌. అన్నీ స‌వ్యంగా పూర్త‌యిదే న‌వంబ‌ర్ 20 నుంచి ముంబైలో ఈ మూవీని ప్రారంభించే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. దీని త‌రువాత యుకె స‌హా వివిధ యురోపియ‌న్ దేశాల్లో షూటింగ్ చేయ‌నున్నార‌ట‌.  

ఈ మూవీకి `ఫైల్ నంబ‌ర్ 323` అని ఫైన‌ల్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. వేల కోట్లు బ్యాంకుల‌కు ఎగ‌వేయ‌డ‌మే కాకుండా విలాస వంత‌మైన జీవితాన్ని సాగించి నిత్యం వార్త‌ల్లో నిలిచిన విజ‌య్ మాల్యాఆ త‌రువాత లండ‌న్ కు పారిపోయి అక్క‌డే నివాసం వుంటున్న విష‌యం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విజ‌య్ మాల్యా వివాదాస్ప‌ద జీవితం ఆధారంగా ఈ మూవీ తెర‌పైకి రానున్న ఈమూవీని క‌లోల్ దాస్‌, మిహిర్ ముత్తా, ప్ర‌తిభా వ్యాస్ నిర్మించ‌నున్నారు. వ‌చ్చే ఏడాది భారీ స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేయ‌నున్నార‌ట‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News