దెబ్బకు డీజే రేంజ్ మారిందస్య!!

Update: 2017-06-04 04:15 GMT
అల్లు అర్జున్ మూవీ డీజే- దువ్వాడ జగన్నాధం క్రేజ్ ఉన్నకొద్దీ పెరిగిపోతోంది. టీజర్ రిలీజ్ తోనే సెన్సేషన్స్ క్రియేట్ చేసిన డీజే.. ఆ తర్వాత కొన్ని రోజులు నెమ్మదించాడు. ఇప్పుడు వరుసగా పాటలను రిలీజ్ చేస్తూ.. ట్రెండింగ్ అవుతున్న దువ్వాడ జగన్నాధం.. వివాదం కారణంగా మరింతగా రేంజ్ మొత్తం మారిందని  అనే చెప్పాలి.

'అస్మైకయోగ తస్మైకభోగ రస్మైకరాగ హిందోళం' అంటూ ప్రారంభమయ్యే పాటలో.. అభ్యంతరకర పదాలు ఉపయోగించారని బ్రాహ్మణ సామాజిక వర్గం ఆరోపించడంతో.. తానూ ఓ బ్రాహ్మడినే.. తనను తాను ఎందుకు అవమానించుకుంటాను అంటూ హరీష్ శంకర్ సమాధానం ఇచ్చాడు. దీంతో వివాదం కొంత సమసిపోయింది. అయితే.. దీనికి ముందే టాప్ ట్రెండింగ్ అయిపోయిన ఈ పాట.. కాంట్రవర్సీ కారణంగా మరింత వేగంగా హిట్స్ సంపాదించుకుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ ట్యూన్ కు.. బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చేస్తోంది.

ఒక రకంగా చెప్పాలంటే.. ఇప్పటివరకూ ఎవరైనా డీజే ను ఫాలో అవకపోతే.. వారికి కూడా ఈ వివాదం కారణంగా డీజే గురించి చేరిపోయింది. ఉద్దేశ్యపూర్వకంగా చేయకపోయినా.. ఈ వివాదం మాత్రం దువ్వాడ జగన్నాధంకు భలేగా కలిసొచ్చేస్తోందని చెప్పచ్చు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం.. జూన్ 23న థియేటర్లలోకి వచ్చేయనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News