దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ తేదీపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. ఎప్పుడు రిలీజ్ చేయాలో యూనిట్ కి క్లారిటీ లేకుండా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో రాజమౌళి ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారనేది ఆ గుసగుసల సారాంశం.
ఇప్పటికే తేదీ పలుమార్లు వాయిదా పడింది. ముందే ప్రకటించి తప్పు చేశామని భావించాల్సిన పరిస్థితి తలెత్తింది. రిలీజ్ విషయంలో వాయిదాల వల్ల ప్రేక్షకులు డిస్ట్రబ్ అవుతారన్న కారణంగా ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. ఇప్పుడున్న క్రైసిస్ లో కొన్ని చోట్ల థియేటర్లు ఇంకా తెరవలేదు. కీలకమైన మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి. తెగించి రిలీజ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పలేని సన్నివేశం ఉంది. ఈ నేపథ్యంలో ఓటీటీకే వెళ్లాలా? లేక నేరుగా బొమ్మ థియేటర్లోకే తెవాలా? ఇలా రకరకాల సందేహాలు. దాదాపు గత రెండు నెలలుగా ఇదే విషయంపై జక్కన్న అండ్ టీమ్ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారట. నిర్మాతలతో తర్జనభర్జన సాగుతోందన్న గుసగుసా వేడెక్కిస్తోంది.
అయితే ఇప్పుడు వాటన్నింటికి ఓ క్లారిటీ దొరికే అవకాశం కనిపిస్తుంది. జక్కన్న అండ్ టీమ్ రిలీజ్ తేదీపై ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు యూనిట్ వర్గాల సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో దసరా కానుకగా అక్టోబర్ లోనే సినిమాని రిలీజ్ చేయాలని రాజమౌళి నిర్ణయం తీసేసుకున్నట్లు తెలిసింది. ఈ నెలాఖరు నాటికి రిలీజ్ తేదీని ప్రకటించాలని జక్కన్న భావిస్తున్నారట. ముందే ప్రకటించినట్టు అక్టోబర్ లోనే రిలీజ్ చేసి అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని రాజమౌళి గట్టిగా సంకల్పించినట్లు సమాచారం. ఈ నెలఖరుకి రిలీజ్ తేదీ ప్రకటించి అభిమానుల్లో జోష్ నింపాలని వెయిట్ చేస్తున్నారుట. తాజా సమాచారాన్ని బట్టి ఆర్.ఆర్.ఆర్ ఫ్యాన్స్ అక్టోబర్ లో ట్రీట్ ఖరారైనట్లే కనిపిస్తోంది. అయితే థర్డ్ వేవ్ గనుక అప్పటికీ పీక్స్ కి చేరితే జక్కన్న ఓటీటీ వైపు వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
`ఆర్.ఆర్.ఆర్` ఇప్పటికే టాకీ పార్టు పూర్తి చేసుకుంది. పాటల చిత్రీకరణ క్లైమాక్స్ లో ఉంది. హైదరాబాద్..ఉక్రెయిన్ లో పాటల షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం యూనిట్ ఉక్రెయిన్ లో సాంగ్ షూట్ చేస్తోంది. రామ్ చరణ్-ఎన్టీఆర్ సహా కీలక నటులంతా పాల్గొంటున్నారు. రాజమౌళి...టాప్ క్లాస్ కొరియోగ్రాఫర్ల ఆధ్వర్యంలో పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రాన్ని డి. వి.వి దానయ్య అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రిలీజ్ ముందే భారీగా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ సాగించిందని కథనాలొచ్చాయి. ఇలాంటి సన్నివేశంలో ఓటీటీలకు వెళ్లే ఛాన్సుంటుందా? కచ్ఛితంగా థియేటర్లలోకి రావాల్సిందేననేది విశ్లేషకుల మాట. దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తారనే భావిస్తున్నారు. ఒకవేళ ఆ డేట్ మిస్సయితే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ చివరిలో రిలీజ్ చేసే వీలుంటుందని అంచనా వేస్తున్నారు.
స్టార్ పవర్ తోనే ఇంత హైప్:
2021 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీగా RRR సంచలనాలు ఖాయమేనా? మునుపెన్నడూ లేని విధంగా టాలీవుడ్ అగ్ర హీరోలు ఇద్దరిని కలిపి చేస్తున్న ప్రయోగమిది. RRR లో అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా కొమరం భీమ్ పాత్రలో తారక్ నటిస్తున్నారు. రామ్ చరణ్ సరసన అలియా నటిస్తుండగా తారక్ సరసన ఒలీవియా నటిస్తోంది. రాజమౌళి కథానాయికలు ఒలీవియా.. ఆలియా పాత్రలను ఒక రేంజులోనే ఎలివేట్ చేసారని టాక్. అలియా భట్ దక్షిణాదినా ఇప్పటికే భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. ఆర్.ఆర్.ఆర్ ఆఫర్ తో తన పేరు మార్మోగిపోతోంది. తదుపరి సౌత్ లోనూ పెద్ద స్టార్ గా అవతరించనుంది. ఇక ఇందులో అజయ్ దేవగన్ పాత్రా ఆద్యంతం రక్తి కట్టించనుందని తెలిసింది.
ఇప్పటికే తేదీ పలుమార్లు వాయిదా పడింది. ముందే ప్రకటించి తప్పు చేశామని భావించాల్సిన పరిస్థితి తలెత్తింది. రిలీజ్ విషయంలో వాయిదాల వల్ల ప్రేక్షకులు డిస్ట్రబ్ అవుతారన్న కారణంగా ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. ఇప్పుడున్న క్రైసిస్ లో కొన్ని చోట్ల థియేటర్లు ఇంకా తెరవలేదు. కీలకమైన మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి. తెగించి రిలీజ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పలేని సన్నివేశం ఉంది. ఈ నేపథ్యంలో ఓటీటీకే వెళ్లాలా? లేక నేరుగా బొమ్మ థియేటర్లోకే తెవాలా? ఇలా రకరకాల సందేహాలు. దాదాపు గత రెండు నెలలుగా ఇదే విషయంపై జక్కన్న అండ్ టీమ్ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారట. నిర్మాతలతో తర్జనభర్జన సాగుతోందన్న గుసగుసా వేడెక్కిస్తోంది.
అయితే ఇప్పుడు వాటన్నింటికి ఓ క్లారిటీ దొరికే అవకాశం కనిపిస్తుంది. జక్కన్న అండ్ టీమ్ రిలీజ్ తేదీపై ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు యూనిట్ వర్గాల సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో దసరా కానుకగా అక్టోబర్ లోనే సినిమాని రిలీజ్ చేయాలని రాజమౌళి నిర్ణయం తీసేసుకున్నట్లు తెలిసింది. ఈ నెలాఖరు నాటికి రిలీజ్ తేదీని ప్రకటించాలని జక్కన్న భావిస్తున్నారట. ముందే ప్రకటించినట్టు అక్టోబర్ లోనే రిలీజ్ చేసి అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని రాజమౌళి గట్టిగా సంకల్పించినట్లు సమాచారం. ఈ నెలఖరుకి రిలీజ్ తేదీ ప్రకటించి అభిమానుల్లో జోష్ నింపాలని వెయిట్ చేస్తున్నారుట. తాజా సమాచారాన్ని బట్టి ఆర్.ఆర్.ఆర్ ఫ్యాన్స్ అక్టోబర్ లో ట్రీట్ ఖరారైనట్లే కనిపిస్తోంది. అయితే థర్డ్ వేవ్ గనుక అప్పటికీ పీక్స్ కి చేరితే జక్కన్న ఓటీటీ వైపు వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
`ఆర్.ఆర్.ఆర్` ఇప్పటికే టాకీ పార్టు పూర్తి చేసుకుంది. పాటల చిత్రీకరణ క్లైమాక్స్ లో ఉంది. హైదరాబాద్..ఉక్రెయిన్ లో పాటల షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం యూనిట్ ఉక్రెయిన్ లో సాంగ్ షూట్ చేస్తోంది. రామ్ చరణ్-ఎన్టీఆర్ సహా కీలక నటులంతా పాల్గొంటున్నారు. రాజమౌళి...టాప్ క్లాస్ కొరియోగ్రాఫర్ల ఆధ్వర్యంలో పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రాన్ని డి. వి.వి దానయ్య అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రిలీజ్ ముందే భారీగా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ సాగించిందని కథనాలొచ్చాయి. ఇలాంటి సన్నివేశంలో ఓటీటీలకు వెళ్లే ఛాన్సుంటుందా? కచ్ఛితంగా థియేటర్లలోకి రావాల్సిందేననేది విశ్లేషకుల మాట. దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తారనే భావిస్తున్నారు. ఒకవేళ ఆ డేట్ మిస్సయితే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ చివరిలో రిలీజ్ చేసే వీలుంటుందని అంచనా వేస్తున్నారు.
స్టార్ పవర్ తోనే ఇంత హైప్:
2021 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీగా RRR సంచలనాలు ఖాయమేనా? మునుపెన్నడూ లేని విధంగా టాలీవుడ్ అగ్ర హీరోలు ఇద్దరిని కలిపి చేస్తున్న ప్రయోగమిది. RRR లో అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా కొమరం భీమ్ పాత్రలో తారక్ నటిస్తున్నారు. రామ్ చరణ్ సరసన అలియా నటిస్తుండగా తారక్ సరసన ఒలీవియా నటిస్తోంది. రాజమౌళి కథానాయికలు ఒలీవియా.. ఆలియా పాత్రలను ఒక రేంజులోనే ఎలివేట్ చేసారని టాక్. అలియా భట్ దక్షిణాదినా ఇప్పటికే భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. ఆర్.ఆర్.ఆర్ ఆఫర్ తో తన పేరు మార్మోగిపోతోంది. తదుపరి సౌత్ లోనూ పెద్ద స్టార్ గా అవతరించనుంది. ఇక ఇందులో అజయ్ దేవగన్ పాత్రా ఆద్యంతం రక్తి కట్టించనుందని తెలిసింది.