పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా.. కేజీఎఫ్ రికార్డు బద్దలు..!

Update: 2022-10-24 11:30 GMT
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్(అప్పు) గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం అందరికీ తెలిసిందే. శారీరకంగా ఎంతో ఫిట్ గా ఉండే పునీత్ రాజ్ కుమార్ ఆరోజు ఉదయం తన ఇంట్లో జిమ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే మృతి చెందాడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అభిమానులు మాత్రం పునీత్ రాజ్ కుమార్ మృతిచెందారనే విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. ఇలాంటి తరుణంలో ఆయన చివరగా నటించిన సినిమాలు తాజాగా రిలీజ్ కు నోచుకుంటున్నాయి.

‘అప్పు’ గత చిత్రం  ‘జేమ్స్’ 17 మార్చి 2022న విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 100 కోట్లుకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇలాంటి తరుణంలో పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా ‘గంధన గుడి’ అక్టోబర్ 28న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మె, పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.

కర్ణాటక సీఎం బొమ్మె మాట్లాడుతూ  ‘గంధన గుడి’ సినిమాకు టాక్స్ మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ‘అప్పు’ మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాడని కీర్తించారు. అనంతరం హీరో యశ్ మాట్లాడుతూ తన చిత్రం ‘కేజీఎఫ్’ రికార్డులను ‘గంధన గుడి’ సినిమా బ్రేక్ చేయాలనే ఆకాంక్షను వెలిబుచ్చాడు.

‘గంధన గుడి’ చిత్రాన్ని పునిత్ రాజ్ కుమార్ ప్రొడక్షన్ బ్యానర్లో అతడి భార్య అశ్వినీ పునిత్ రాజ్ కుమారే నిర్మించారు. ఈ చిత్రానికి అమోఘ వర్ష దర్శకత్వం వహించారు. కాగా ఈమూవీ ట్రైలర్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలోనే విడుదల చేయడం విశేషం. ఈ సినిమాను పునీత్ రాజ్ కుమార్ వర్ధంతికి ఒకరోజు ముందే అంటే అక్టోబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News