దిగజారవద్దంటూ నెటిజన్స్‌ కు ఇస్మార్ట్‌ బ్యూటీ వార్నింగ్

Update: 2021-07-17 08:30 GMT
ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో హీరోయిన్‌ గా ఒక్కసారిగా బిజీ అయిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌. ఈ అమ్మడు తెలుగు లో పవన్‌ కళ్యాణ్‌ తో హరిహర వీరమల్లు సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ లో అతి త్వరలోనే ఈమె జాయిన్ అవ్వబోతుంది. పవన్‌ మూవీ మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తున్న ఈమె సోషల్‌ మీడియాలో కొందరు చేస్తున్న కామెంట్స్ మరియు అనవసర విషయాలను ఎక్కువగా షేర్‌ చేయడం పై విమర్శలు వ్యక్తం చేసింది. సోషల్‌ మీడియాలో చీప్ పనులు చేస్తూ దిగజారవద్దంటూ ఆమె హెచ్చరించింది.

హాట్ ఫొటోలను రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన నిధి అగర్వాల్‌ ఈసారి మాత్రం కొన్ని పోస్ట్‌ లను మరియు ఫొటోలను అవసరం లేకున్నా కూడా తెగ సర్క్యూలేట్‌ చేస్తున్నారు అంటూ నెటిజన్స్ పై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎవరైనా తమ దృష్టికి వచ్చిన అనవసర పోస్ట్‌ లను షేర్‌ చేయకుండా అడ్డుకుంటే అసత్య ప్రచారం అక్కడితో ఆగిపోతుందని.. కాని ఎక్కువ మంది చీప్ గా ఇష్టానుసారంగా షేర్స్ చేస్తున్నారు అంటూ ఆమె అసహనం వ్యక్తం చేసింది. వాటిని అధికంగా చేయడం అంటే చీప్ పనులు చేయడం.. దిగజారడమే అవుతుందని చెప్పుకొచ్చింది.

నిధి అగర్వాల్‌ కు ఎందుకు అంత కోపం వచ్చింది అనే విషయం ప్రస్తుం చర్చనీయాంశంగా మారింది. ఆమె కు ఎందుకు అంతగా కోపం వచ్చింది.. ఆమె ఏ పోస్ట్ ను జనాలు తెగ షేర్‌ చేస్తున్నారు అనేది చర్చ నీయాంశంగా మారింది. నెటిజన్స్ చాలా మంది ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ హాట్ ఫొటోలను షేర చేస్తూ ఉన్నారు. మరి వాటిలో నిధికి ఇబ్బంది కలిగించిన ఫొటో ఏది ఎందుకు ఆమె మనసు నొచ్చుకుంది అనే విషయాలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి నెటిజన్స్ ను సున్నితంగా విమర్శించి దిగజారవద్దంటూ విజ్ఞప్తి చేసింది.




Tags:    

Similar News