ఫొటోటాక్‌ : కపూర్‌ సిస్టర్స్‌ పండుగ ఫోజ్‌

Update: 2020-11-15 14:30 GMT
తెలుగు తో పాటు దేశంలోని అన్ని భాషల ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్‌ ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తోంది. తల్లి మృతి చెందిన తర్వాత చెల్లి విషయంలో తాను బాధ్యతలు తీసుకుంటాను అంటూ ఆమద్య ప్రకటించిన జాన్వీ కపూర్‌ రెగ్యులర్‌ గా చెల్లికి సంబంధించిన విషయాలను ఎమోషనల్‌ గా షేర్‌ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో సారి జాన్వీ కపూర్‌ చెల్లితో దిగిన ఫొటోలను దీపావళి సందర్బంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

జాన్వీ కపూర్‌ చాలా అందంమైన ఎల్లో కాస్ట్యూమ్స్‌ లో కనిపించింది. చెల్లి ఖుషి కపూర్‌ తో పోల్చితే జాన్వీ కపూర్‌ చాలా అందంగా ఉన్నారు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఆ కామెంట్స్‌ విషయం పక్కన పెడితే ఈ కపూర్‌ సిస్టర్స్‌ షేర్‌ చేసిన పండుగ ఫోజ్‌ అందరిని విశేషంగా ఆకట్టుకుంటుంది. గతంలో కరిష్మా కపూర్‌ మరియు కరీనా కపూర్‌ ల మాదిరిగా వీరిద్దరు కూడా చాలా ఫేమస్‌ అవ్వాలంటూ అంతా కోరుకుంటున్నారు.


Tags:    

Similar News