142 రోజులుగా జాకీ ప‌ని అదేనా?

Update: 2022-03-13 10:30 GMT
శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ టెంప్టింగ్ ఫోజుల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇన్ స్టా వేదిక‌గా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌దైన గ్లామ‌ర్ షోతో ఆక‌ట్టుకుంటుంది. తాజాగా జాకీ కొత్త ఫోటో ఒక‌టి ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ఎరుపు-తెలుపు చార‌ల డిజైన‌ర్ దుస్తుల్లో జాకీ త‌ళుక్కున మెరిసింది. పిక్ లో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. ఇందులో జాకీ క‌నుబొమ్మ‌లు స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతున్నాయి. చూప‌రుల‌ను ఆ ముఖమందం  ప్ర‌త్యేకంగా ఆక‌ట్టుకుంటుంది.

ముఖానికి లైట్ మ్యాక‌ప్..పెద‌వుల‌కు లైట్ లిప్  స్టిక్ పూసుకుంది. చెవుల‌కి మాత్రం ధ‌గ‌ధ‌గ‌లాడే మెరుపుపొడుల చెవులీలు ధ‌రించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్  గా మారింది. చూసి త‌న‌వితీర‌డం జాకీ అభిమానుల వంత్తైంది. సాధార‌ణంగా జాకీ ఫోటో షూట్ లో  గ్లామ‌ర్ ఎలివేష‌న్ స్ ఉంటాయి. కానీ ఇందులో వాటికి దూరంగా క‌నిపిస్తుంది. అందుకు ఓ కార‌ణం ఉంది.

ఇది ఓ ప్రమోష‌న్ కార్య‌క్ర‌మంలో హాజ‌రైన సంద‌ర్భంగా తీసిన ఫోటో. ఓ మోబైల్ ఫోన్ల‌కు సంబంధించి  కొద్ది రోజులుగా నిర్విరామంగా వివిధ సిటీల్లో తిరుగుతుంది. అందులో భాగంగా 142వ రోజు తీసిన ఫోటో ఇది. ఆ ఫోటోనే ఇలా షేర్ చేసి త‌న షాపీ ప్ర‌మోష‌న్ కి సంబంధించిన పిక్ అని రివీల్ చేసింది. అంటే కొన్ని నెల‌లుగా జాక్విలిన్ ఇలా ఓ ఫోన్ కి సంబంధించిన ప్ర‌మోష‌న్ ప‌నుల్లోనే   నిమ‌గ్న‌మైన‌ట్లు తెలుస్తోంది.

ఇటీవ‌లే జాకీ న‌టించిన పాప్ వీడియో ఒక‌టి రిలీజ్ అయి నెట్టింట సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా పాండమిక్ స‌మ‌యంలో ఖాళీగా  లేకుండా బ్యూటీ ఇలా ఓ  పాప్ వీడియో సాంగ్ చేసింది. ఇక న‌టిగా..క్యామిప్ పాత్ర‌ల‌తో బిజీగానే ఉంది. ఇక ప్ర‌స్తుతం జాకీ చేతులో నాలుగైదు సినిమాలున్నాయి.

`బ‌చ్చ‌న్ పాండే` షూటింగ్ పూర్తిచేసింది. షూటింగ్ పూర్తిచేసిన `ఎటాక్` సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. `సిర్క‌స్`..`రామ‌సేతు` చిత్రాలు ఆన్  సెట్స్ లో ఉన్నాయి. `విక్రాంత్ రానా` అనే క‌న్న‌డ చిత్రంలో కామియో పాత్ర పోషించింది.

ఇక వ్య‌క్తిగ‌తంగా  జాక్వెలిన్ 200 కోట్ల కుంభ‌కోణం కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కోంటున్న సంగ‌తి  తెలిసిందే . కేసులో ప్ర‌ధాన  నిందుతుడుగా ఉన్న సుకేష్ చంద్ర‌తో ఆమెకున్న ప‌రిచ‌యాలు కార‌ణంగా జాకీ చూట్టూ ఆరోప‌ణ‌లు ముసురుకున్నాయి. ఇప్ప‌టికే ఈడీ ముందు విచార‌ణ‌కు హాజ‌రైంది. ఆమె వెర్ష‌న్ వినిపించింది. కేసు విచార‌ణ మొత్తం పూర్త‌యితే గానీ అసుల దోషులెవ‌రు? అన్న‌ది  తేల‌దు.  అప్ప‌టివ‌ర‌కూ ఈడీ విచార‌ణ‌కు జాకీ స‌హ‌క‌రించాల్సిందే.


Tags:    

Similar News