చెన్న‌య్ కోసం మల్లూ స్టార్‌ త‌ప‌న‌

Update: 2015-12-12 06:27 GMT
చెన్న‌య్ వ‌ర‌ద‌ల్లో మునిగిపోయింది. ప్ర‌స్తుతం అక్క‌డ భ‌యాన‌క ప‌రిస్థితి నెల‌కొంది. ఓ వైపు కాటేస్తాయేమోనన్న అంటు రోగాలు, మ‌రోవైపు తిండి చాల‌క జ‌నాలు అల్ల‌ల్లాడిపోతున్నారు. క‌నీసం తాగు నీరు లేక తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ప్ర‌భుత్వాల, ఇరుగు పొరుగు సాయం అస్స‌లు స‌రిపోవ‌డం లేదు. ఏదైతేనేం?  ఇలాంటి ఠ‌ఫ్ సిట్యుయేష‌న్‌లో టాలీవుడ్ స్టార్లు స్పందించిన తీరు ప్ర‌స్తుతం త‌మిళ‌నాట చ‌ర్చ‌కొచ్చింది. మ‌న స్టార్లంతా ల‌క్ష‌ల్లో విరాళాల్ని అందించారు. అంత‌కుమించి ఆహారాన్ని, తాగు నీటిని, మెడిసిన్‌ని స‌ర‌ఫ‌రా చేశారు.

ద‌గ్గుబాటి రానా ప‌బ్లిక్ నుంచి ఆహార ప్ర‌దార్థాల్ని సేక‌రించి ధ‌నుష్ వంటి హీరోల సాయంతో చెన్న‌య్‌లో పంచారు. మ‌న స్టార్లు సౌత్‌లో ఉన్న అంద‌రికీ చ‌క్క‌ని ఇన్‌స్పిరేష‌న్ ఇచ్చారు. చెన్న‌య్‌తో అనుబంధం ఉన్న ఇత‌ర రాష్ర్టాల న‌టీన‌టులంతా ఇదే తీరుగా స్పందిస్తున్నారు. లేటెస్టుగా తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళంలో పాపుల‌ర్ స్టార్‌గా ఐడెంటిటీ ఉన్న పృథ్వీరాజ్ చెన్న‌య్ వ‌ర‌ద‌ల‌కి చ‌లించిపోయాడు. చెన్న‌య్ వాసుల‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. అక్క‌డ నా సినిమాలు బాగా ఆడాయ్‌. అలాంట‌ప్పుడు నేను ఇప్పుడు సంతోషంగా ఉండ‌లేను అని ప్రూవ్ చేస్తూ త‌న తాజా సినిమా పావ‌డా ఆడియోని చాలా సాదాసీదాగా జ‌రిపేసుకున్నాడు.

ఈ ఆడియోకి వాస్త‌వానికి 300 మంది గెస్టుల్ని ఆహ్వానించిన పృథ్వీ చివ‌రికి వారంద‌రినీ క‌ట్ చేసుకుని కేవ‌లం 25 మందితో సోసోగా ఆడియో పూర్తి చేసేశాడు. అలా మిగిల్చిన డ‌బ్బును చెన్న‌య్ వ‌ర‌ద బాధితుల కోసం డొనేట్ చేశాడు. మునుముందు మ‌రింత మంది సౌత్ స్టార్స్ స్పందించి  ఇలా సాయం చేయాల‌ని కోరుకుందాం.
Tags:    

Similar News