బాలయ్య మరోసారి ఆ డైరెక్టర్ తో..

Update: 2020-04-12 02:30 GMT
గత కొంతకాలంగా నటసింహం బాలకృష్ణ ఫ్యాన్స్ ని ప్లాప్ సినిమాలతో నిరాశపరుస్తున్నాడు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు మరియు రూలర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కట్టాయి. ఇప్పుడు బాలకృష్ణ కి హిట్టు తప్పనిసరి అయిపొయింది. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్‌ సినిమాలు మంచి విజయం సాధించటం తో ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తనకి గతంలో మంచి హిట్లు ఇచ్చిన సీనియర్ దర్శకుడు బి గోపాల్ తో ఓ సినిమాని చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. గతంలో బాలకృష్ణ-బి గోపాల్ కాంబినేషన్ లో లారీ డ్రైవర్ - రౌడీ ఇన్‌ స్పెక్టర్ - సమరసింహా రెడ్డి - నరసింహ నాయడు లాంటి సూపర్‌ హిట్ సినిమాలు వచ్చాయి. చివరగా వీళ్లిద్దరి కాంబినేషన్ లో 'పల్నాటి బ్రహ్మనాయుడు' చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత 'హర హర మహదేవ ' అనే సినిమాని మొదలుపెట్టినప్పటికీ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇక ప్రస్తుతం బి గోపాల్ సినిమాలు అయితే చేయడం లేదు. చివరగా ఆయన గోపీచంద్ హీరోగా ఆరడుగుల బుల్లెట్టు సినిమాకి దర్శకత్వం వహించారు. కానీ సినిమా విడుదల కాలేదు.

ఇప్పుడు ఈ సీనియర్‌ డైరెక్టర్‌ బాలయ్య హీరోగా సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఇప్పటికే ఇద్దరి మధ్య కథ చర్చలు కూడా జరిగాయని బాలయ్య కూడా దీనికి ఓకె చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే జూన్ నెల 10న లాంఛనంగా సినిమా ముహూర్తం చేయనున్నారని టాక్. ప్రస్తుతం డైరెక్టర్ కూడా స్క్రిప్ట్ పూర్తిచేసే పనిలో పడ్డాడట. ఈ వార్త విన్న బాలయ్య ఫ్యాన్స్ లో ఆనందం ఆకాశాన్ని తాకుతుంది. త్వరలోనే బాలయ్య ఫ్యాన్స్ తీపి కబురు వింటారని అన్పిస్తుంది.
Tags:    

Similar News