విడ్డూరం.. స్టార్‌ హీరోయిన్ పాతికేళ్ల లోపే లవ్‌ అండ్ బ్రేకప్‌

Update: 2022-04-05 05:35 GMT
బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన అనన్య పాండే లవ్‌ వ్యవహారంతో మరో సారి మీడియాలో వార్తగా నిలిచింది. పాతికేళ్ల వయసు కూడా లేని ఈ ముద్దుగుమ్మ ఈమద్య కాలంలో తన ప్రియుడు ఇషాన్ ఖట్టర్ కి దూరంగా ఉంటుందని ముంబయి మీడియా వర్గాల వారు గుసగుసలాడుకుంటున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ను చాలా మంది కూడా మొదటి నుండి మెచ్యూరిటీ లేని ప్రేమ అంటూ వచ్చారు.

ఇద్దరు కూడా పాతికేళ్ల లోపు వాళ్లే అవ్వడంతో మొదట అట్రాక్షన్ తో ప్రేమలో ఉన్నాము అనుకుని కాస్త హడావిడి చేశారు. కాని ఇప్పుడు వారికి కాస్త లోక జ్ఞానం తెలుస్తుంది.. అంతే కాకుండా వారు వారి కెరీర్ లో బిజీ అవుతున్నారు. ఈ సమయంలో ప్రేమ.. పెళ్లి గురించి ఆలోచన చేయడం సమయం వృదా అవుతుంది అనుకుంటున్నట్లుగా ఉన్నారు. అందుకే బ్రేకప్‌ చెప్పేసుకున్నారు అంటూ బాలీవుడ్‌ కు చెందిన ఒక మీడియా ప్రతినిధి సోషల్‌ మీడియాలో పేర్కొన్నాడు.

నెట్టింట తెగ హడావుడి జరుగుతున్న వీరి రిలేషన్‌ విషయమై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కాని ఖచ్చితంగా వీరిద్దరు ప్రేమలో మునిగి తేలి ఇప్పుడు ఒడ్డుకు వచ్చి ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు అంటూ సమాచారం అందుతోంది. ఈ విషయంలో వారి నుండి ఎలాంటి క్లారిటీ వస్తుందా అంటూ మీడియా వర్గాల వారు మరియు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

2020 సంవత్సరంలో అనన్య పాండే మరియు ఇషాన్ లు కలిసి ఖాలీ పీలీ సినిమా లో నటించారు. ఇప్పుడు బాలీవుడ్‌ లో అనన్య స్టార్‌ హీరోయిన్ గా మారిపోయింది. కనుక ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. దాంతో ప్రేమ విషయాన్ని కొన్నాళ్లు పక్కకు పెట్టే ఆలోచనకు వచ్చిందేమో అనే ఊహాగాణాలు వస్తున్నాయి. ఇంకా పాతికేళ్లు కూడా వయసు లేదు కనుక ఆమె పెళ్లికి మరో పదేళ్ల సమయం ఉంది కనుక ఇప్పటి నుండే పెళ్లి గురించి ఆలోచన వద్దు అనుకుని ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు ప్రేక్షకుల ముందుకు రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండతో కలిసి నటించిన లైగర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లైగర్ సినిమా విడుదలకు ముందే అనన్య పాండేకు తెలుగు లో రెండు మూడు పెద్ద ఆఫర్లు వచ్చాయట. కాని ప్రస్తుతానికి మొత్తం బాలీవుడ్‌ పైనే ఫోకస్ పెట్టాలని భావిస్తుందట. లైగర్ సినిమా పాన్ ఇండియా మూవీ అవ్వడం వల్ల నటించేందుకు ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.
Tags:    

Similar News