తారక్ - చరణ్ లతో మళ్ళీ షూట్ ప్లాన్ చేస్తున్న జక్కన్న..?

Update: 2021-09-04 02:30 GMT
యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ - మెగా పవర్​ స్టార్​ రామ్​ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ''ఆర్.ఆర్.ఆర్''. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందని.. పోస్ట్​ ప్రొడక్షన్​ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని ఇటీవలే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో తారక్ - చరణ్ ఇద్దరూ తదుపరి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ గా పిలవబడే జక్కన్న.. మరికొన్ని సీన్స్ షూట్ కోసం ట్రిపుల్ ఆర్ హీరోలను పిలిచినట్లు సెట్స్ మీదకు పిలుస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాలను ఇంకా పర్ఫెక్ట్ గా తీయాలని భావించిన రాజమౌళి.. మరో నాలుగైదు రోజుల షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు కొత్త ప్రాజెక్ట్స్ సెట్స్ మీదకు వెళ్ళేలోపే వీటి చిత్రీకరణ కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యారట. అయితే ఇదే ఇప్పుడు ఇద్దరు హీరోల అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే రాజమౌళి ఎప్పుడు కూడా చెప్పిన సమయానికి షూటింగ్‌ పూర్తి చేయడని టాక్ ఉంది.

ఇప్పుడు RRR షూటింగ్ కోసం ఊహించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటే.. అది తారక్ - చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ మరికొన్ని రోజులు ఆలస్యంగా మొదలవడానికి ఊతమిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఇప్పుడు ఇద్దరు హీరోలను పిలిచింది చిన్న చిన్న ప్యాచ్ వ‌ర్క్ షూటింగ్ కోసమా లేదా కీలక సన్నివేశాల రీషూట్ కోసమా అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే యావ‌త్తు సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' ప్ర‌క‌టించిన తేదీకే రావడం లేదని స్పష్టమైంది.

అక్టోబర్ 13న రాకపోతే తదుపరి విడుదల తేదీని ఎప్పుడు అనౌన్స్ చేస్తారని అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. 2022 సంక్రాంతికి కానుకగా జనవరి 8న RRR సినిమా వచ్చే అవకాశం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి. కాగా, ఈ చిత్రంలో మ‌న్యంవీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్‌ చ‌ర‌ణ్‌.. గోండు బెబ్బులి కొమురం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. ఆలియా భ‌ట్‌ - ఒలివియా మోరిస్‌ వీరికి జోడీగా కనిపించనున్నారు.

అజ‌య్ దేవ‌గ‌ణ్‌ - స‌ముద్ర‌ఖ‌ని - శ్రియ - రే స్టీవెన్ సన్‌ - అలిస‌న్ డూడి ఇలా పలువురు బాలీవుడ్‌, హాలీవుడ్ నటీనటులు RRR సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ పై డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.


Tags:    

Similar News