తేజు తమ్ముడికి బ్రేక్ వేసారా?

Update: 2018-07-19 06:22 GMT
ఫ్యామిలీలో ఒక హీరో సక్సెస్ అయినప్పుడు ఇంట్లో మరొకరు ఉంటే అతన్ని కూడా లాంచ్ చేయటం సర్వసాధారణం. ఇది చిరంజీవి మొదలుకుని నాగ చైతన్య వరకు అందరి కుటుంబాల్లో జరిగిందే. అదే కోవలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ని టాలీవుడ్ కు పరిచయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏడాది నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ కార్యరూపం దాల్చలేదు. ఇటీవలే రవితేజతో నేల టికెట్టు నిర్మించిన రామ్ తాళ్ళూరి ఆసక్తిగా ఉన్నారని త్వరలో షూటింగ్ మొదలు కావొచ్చని ఈ మధ్యే ప్రచారం ఊపందుకుంది. దానికి తోడు బాడీ అండ్  హెయిర్ మేకోవర్ కోసం అమెరికా వెళ్లిన సాయి ధరమ్ తేజ్ కు అండగా రామ్ తాళ్ళూరినే దగ్గరుండి చూసుకుంటున్నారనే మరో వార్త దీనికి ఇంకా బలం చేకూర్చింది. కానీ అవన్నీ కొట్టిపారేస్తున్నారు రామ్ తాళ్ళూరి. ప్రస్తుతానికి వైష్ణవ్ తేజ్ ని లాంచ్ చేసే ఆలోచన గురించి ఇప్పుడే చెప్పలేమని వచ్చిన ప్రచారాలన్నీ అవాస్తవమని కొట్టి పారేస్తున్నారు.

ఇక్కడే గమనించాల్సిన పాయింట్ మరొకటి ఉంది. ఇప్పుడే ఏ విషయం చెప్పలేం ప్రస్తుతానికి అవాస్తవం అంటున్నారు కానీ పూర్తిగా అసలు ఛాన్స్ లేదు అని చెప్పడం లేదు. సో ఇప్పుడు కాకపోయినా ముందు ఉండే అవకాశం అయితే ఉంది. అసలే సాయి ధరమ్ తేజ్ స్వయంగా బ్యాడ్ పీరియడ్ లో ఉన్నాడు. వరసగా తగిలిన ఆరు బాక్స్ ఆఫీస్ దెబ్బల నుంచి కోలుకోవడానికి కొంత టైం పట్టేలా ఉంది. ఈ టైంలో వైష్ణవ్ తేజ్ ని  లాంచ్ చేయటం అంత కరెక్ట్ కాదు. అందుకే వేచి చూసే ధోరణిలో తేజు ఫ్యామిలీ ఉన్నట్టు కనిపిస్తోంది. మరోపక్క వైష్ణవ్ యాక్టింగ్ పరంగా శిక్షణ కూడా పూర్తి చేసుకున్నాడట. కళ్యాణ్ దేవ్ విజేత ఫలితం చూసాక ఎలాంటి కథతో పరిచయం చేయాలి అనే దాని గురించి తొందరపకుండా కాస్త ఆలస్యంగానే వైష్ణవ్ ని సినిమాల్లో తీసుకొచ్చేలా ఉన్నారు. సో తేజు తమ్ముడి కథకు తాత్కాలిక బ్రేక్ పడినట్టే.
Tags:    

Similar News