ఈ ముంబైభామ రాంచరణ్ సరసన రెండోసారి ఓకే అయ్యిందా..??

Update: 2021-03-10 10:34 GMT
మెగాపవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది. అంటే ఈ సినిమాతో రాంచరణ్ పాన్ ఇండియా హీరోగా పరిచయం కాబోతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఆర్ఆర్ఆర్ మూవీ ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉండగా రాంచరణ్ తదుపరి సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేయనున్న విషయం విదితమే. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా బయటికి వచ్చాయి. అలాగే ఈ సినిమా రాంచరణ్ కెరీర్లో 15వ సినిమా. శంకర్ అండ్ రాంచరణ్ కాంబినేషన్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు హీరోయిన్లను సంప్రదించడం కూడా జరిగిందట. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమాను మల్టీలాంగ్వేజెస్ లో విడుదల చేయనున్నారు. అయితే తాజాగా హీరోయిన్ విషయంలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. రాంచరణ్ సరసన ఈ సినిమాలో వినయవిధేయరామ ఫేమ్ కియారా అద్వానీ ఓకే అయిందని.. అలాగే ఆమె కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పుకార్లు వెలువడ్డాయి. మరి ఇదేగనక నిజమైతే రాంచరణ్ - కియారా కాంబోలో ఇది రెండో సినిమా అవుతుంది. మరి అమ్మడు ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అలాగే కియారాను ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబో మూవీకోసం కూడా సంప్రదించినట్లు తెలుస్తుంది. చూడాలి మరి కియారా ఓకే అవుతుందో లేదో!
Tags:    

Similar News