మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` చివరి అంకం షూటింగ్ ఫినిష్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఉక్రేయిన్ షూటింగ్ లో జక్కన్న టీమ్ బిజీ బిజీ. చరణ్- తారక్ సహా కీలక నటీనటులంతా షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. కీలకమైన పాటల్ని అక్కడే షూట్ చేస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్టు పూర్తి చేసుకోవడంతో యూనిట్ కి కాస్త సమయం కూడా దొరుకుతోంది. పాటల చిత్రీకరణకు అవసరమైన సిబ్బంది మాత్రమే హాజరవుతున్నారు. విదేశీ షెడ్యూల్ కాబట్టి సినిమాకి సంబంధించిన ముఖ్యమైన క్రూ మాత్రమే హాజరయ్యారు. జక్కన్న అలాగే కొరియోగ్రాఫర్ల ఆధ్యర్యంలోనే పాటల చిత్రీకరణ జరుగుతోంది.
అయితే చరణ్ -తారక్ కి మాత్రం జక్కన్న రెస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఆ ఇద్దరు ఉక్రెయిన్ వీధుల్లో చిల్ అవుతోన్న ఓ వీడియో ట్విటర్లో వైరల్ అవుతోంది. `ఆర్.ఆర్.ఆర్` యూనిట్ ఆ వీడియోను ట్విటర్లో పోస్ చేసి ``మా హీరోలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో? చూడండి`` అంటూ హైలైట్ చేసారు. విలాసవంతమైన కార్ లో ఆ ఇద్దరూ ప్రయాణిస్తున్నారు. కారులో పాటలు వింటూ జర్నీ ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో చరణ్- తారక్ అభిమానుల్లో జోరుగా వైరల్ అవుతోంది. స్నేహితులిద్దరూ పక్కపక్కనే కూర్చుని చిల్ అవుతున్న మూవ్ మెంట్ ని చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి `ఆర్.ఆర్.ఆర్` తో జక్కన్న పరిశ్రమలో ఎదురే లేని అగ్ర హీరోల అభిమానుల్ని ఏకం చేసినట్లు కనిపిస్తోంది. మెగా-నందమూరి బాండింగ్ ని ఇది మరింత ధృఢం చేసింది. ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. టాకీ పార్టు పూర్తవ్వడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేసారు. వాటిని ప్రత్యేకంగా జక్కన్న టెక్నికల్ టీమ్ దగ్గరుండి చూసుకుంటుంది. ఈ చిత్రాన్ని డి. వి.వి. దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Full View
అయితే చరణ్ -తారక్ కి మాత్రం జక్కన్న రెస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఆ ఇద్దరు ఉక్రెయిన్ వీధుల్లో చిల్ అవుతోన్న ఓ వీడియో ట్విటర్లో వైరల్ అవుతోంది. `ఆర్.ఆర్.ఆర్` యూనిట్ ఆ వీడియోను ట్విటర్లో పోస్ చేసి ``మా హీరోలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో? చూడండి`` అంటూ హైలైట్ చేసారు. విలాసవంతమైన కార్ లో ఆ ఇద్దరూ ప్రయాణిస్తున్నారు. కారులో పాటలు వింటూ జర్నీ ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో చరణ్- తారక్ అభిమానుల్లో జోరుగా వైరల్ అవుతోంది. స్నేహితులిద్దరూ పక్కపక్కనే కూర్చుని చిల్ అవుతున్న మూవ్ మెంట్ ని చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి `ఆర్.ఆర్.ఆర్` తో జక్కన్న పరిశ్రమలో ఎదురే లేని అగ్ర హీరోల అభిమానుల్ని ఏకం చేసినట్లు కనిపిస్తోంది. మెగా-నందమూరి బాండింగ్ ని ఇది మరింత ధృఢం చేసింది. ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. టాకీ పార్టు పూర్తవ్వడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేసారు. వాటిని ప్రత్యేకంగా జక్కన్న టెక్నికల్ టీమ్ దగ్గరుండి చూసుకుంటుంది. ఈ చిత్రాన్ని డి. వి.వి. దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.