మెగా హీరో ఇంటిలిజెంటే.. నో డౌట్

Update: 2018-01-03 15:12 GMT
కెరీర్ మొదట్లో వరుస హిట్స్ అందుకున్న హీరోలు ఎప్పుడో ఒకప్పుడు అపజయలను వరుసగా చూడక తప్పదు. అది కూడా ఒక విధంగా మంచిదనే చెప్పాలి. లేకుంటే ఈజీగా బాక్స్ ఆఫీస్ హిట్స్ ను అందుకోలేరు. ఇక అసలు విషయానికి వస్తే.. ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లో ఉన్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్. అయితే ఈ హీరో గత కొంత కాలంగా అపజయలతో సతమతమవుతోన్న సంగతి తెలిసిందే. కానీ నెక్స్ట్ ఎలాగైనా హిట్ అందుకోవాలని కసిగా కష్టపడుతున్నాడు.

అందుకు అతనికి ఆయుధంలా మాస్ దర్శకుడు వివి.వినాయక్ కూడా దొరికాడు. ప్రస్తుతం ఈ కాంబినేషన్ గురించి రోజు ఎదో ఒక న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా సినిమా టైటిల్ విషయంలో చిత్ర యూనిట్ ఏ నిర్ణయాన్ని కరెక్ట్ గా చెప్పడం లేదు. ఓ రెండు టైటిల్స్ గురించి సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. మొదట ఇంటిలిజెంట్ అని కొన్ని మీడియాలలో కథనాలు వెలువడ్డాయి. అదే ఫిక్స్ అని కూడా టాక్ వచ్చింది. కానీ మళ్లీ కొత్త పెరు మెగా ఫ్యాన్స్ ని ఆకర్షించింది. ధర్మా భాయ్ అని మాస్ స్టైల్ లో పెట్టాలని చిత్ర యూనిట్ సూచించిందట.

అయితే మొదట వినాయక్ సెలెక్ట్ చేసిన టైటిల్ మాత్రం ఇంటిలిజెంట్. కానీ క్లాస్ గా ఉందని ఎవరు ఒప్పుకోలేదు. ఫైనల్ గా సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ ని చూసిన తరువాత వినాయక్ చెప్పినట్టు ఇంటిలిజెంట్ అనే టైటిల్ అయితేనే సినిమాకి కరెక్ట్ గా సెట్ అవుతుందని సాయి ధరమ్ తేజ్ అలాగే నిర్మాతలు చెప్పడంతో అదే టైటిల్ ని ఫైనల్ చేశారని చిత్ర యూనిట్ ద్వారా తెలిసింది. ఇక సినిమా దాదాపు ఏండింగ్ కావడానికి వస్తోంది. హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి గ్లామర్ ఆరబోస్తున్న సంగతి తెలిసిందే. సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.
Tags:    

Similar News