మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత జాక్ పాట్

Update: 2021-12-31 07:34 GMT
పుష్ప ఐట‌మ్ నంబ‌ర్ `ఊ అంటావా ఊఊ అంటావా?..` ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ పాట‌లో బోల్డ్ మూవ్స్ తో సామ్ అద‌ర‌గొట్టేయ‌డంతో యూత్ త‌న‌ని ఆరాధిస్తున్నారు. అటు ఉత్త‌రాది వారికి ఫ్యామిలీమ్యాన్ 2 సిరీస్ తో సామ్ బాగా క‌నెక్టయ్యింది. రాజీ అనే తీవ్ర‌వాదిగా న‌టిస్తూ బోల్డ్ యాంగిల్ ని ఆవిష్క‌రించిన సామ్ కి నార్త్ యూత్ క‌నెక్ట‌య్యి ఉన్నారు. అందుకే ఇప్పుడు వ‌రుస‌గా అగ్ర హీరోలు స‌మంత‌ను వ‌దులుకునేందుకు ఆస‌క్తిగా లేరు. వెంట వెంట‌నే త‌మ సినిమాల‌కు లాక్ చేస్తున్నారు. చ‌ర‌ణ్‌.. ఎన్టీఆర్.. మ‌హేష్ లాంటి అగ్ర హీరోల చూపు ఇప్పుడు స‌మంత పైనే ఉంది.

తాజా స‌మాచారం మేర‌కు మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత న‌టించ‌నుంద‌ని తెలిసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే పూజా హెగ్డే ఈ మూవీకి కథానాయికగా ఎంపికైంది. 2022లో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఇంత‌లోనే నేమ్ ఛేంజ్ వినిపిస్తోంది. డేట్స్ సమస్య కారణంగా పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నదని సమంతను ఎంపిక చేసుకున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టికి ఇవి ఊహాగానాలే.. కానీ ఒక సెక్ష‌న్ సోషల్ మీడియాలో ఈ వార్త వైర‌ల్ గా హల్ చల్ చేస్తోంది. విడాకుల తర్వాత సమంత తనను తాను మళ్లీ బిగ్ గేమ్ లోకి తీసుకువచ్చే ఒక పెద్ద చిత్రం కోసం వెతుకుతోంది. అది ఈ సినిమా అవుతుందా.. లేదా? అనేదానికి కాలమే స‌మాధానం చెబుతుంది.
Tags:    

Similar News