సుక్కు అండ్ త్రివిక్రమ్ ఫోన్ చేశారట

Update: 2018-05-09 06:12 GMT
ఒక దర్శకుడికి మరో దర్శకుడి నుంచి ప్రశంసలు అందితే ఆ ఫీలింగ్ ఎంత గొప్పగా ఉంటుందో అనుభూతి పొందిన వారికే తెలుస్తుంది. ఒక దర్శకుడి సృజనాత్మకత మరొక దర్శకుడికి అర్ధమయినట్టుగా మరెవ్వరికీ అర్ధం కాదు. అలానే రచయిత నుంచి దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ స్టార్ దర్శకుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ను అందుకున్నాడు. ఇటీవల వంశీ డైరెక్ట్ చేసిన నా పేరు సూర్య సినిమా రు రిలీజ్ అయినా సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ - అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకుంది. ముఖ్యంగా సినీ ప్రముఖులకు ఆ చిత్రం చాలా నచ్చిందని చెప్పాలి. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సినిమా రావడం. అందులో అల్లు అర్జున్ అద్భుతంగా నటించడం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అయితే దర్శకుడు త్రివిక్రమ్ సినిమా చుసిన తరువాత దర్శకుడిని ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. దాదాపు గంట పాటు ఫోన్లో సినిమా గురించి మాట్లాడాడట.

ఇక యూఎస్ లో ఉన్న సుకుమార్ అయితే అక్కడే సినిమా చూసి వంశీకి కాల్ చేశాడట. సుక్కు సినిమా చూసి చాలా ఎమోషనల్ అయ్యినట్లు వంశీకి చెప్పాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు ఈ విషయాన్ని వివరించాడు. మంచి స్టార్ దర్శకుల నుంచి ప్రశంసలు రావడం చాలా ఆనందంగా ఉందని వక్కంతం వంశీ తెలుపుతూ.. నెక్స్ట్ సినిమాకు సంబందించిన అప్డేట్ ను త్వరలోనే చెబుతానని చెప్పాడు.        


Tags:    

Similar News