షాకింగ్ రూమర్: ఎస్వీ కృష్ణారెడ్డితో బాలయ్య

Update: 2016-12-27 09:30 GMT
బాలయ్య అప్పుడప్పుడూ షాకింగ్ కాంబినేషన్లు సెట్ చేస్తుంటాడు. ‘సింహా’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దాసరి నారాయణ రావుతో ‘పరమవీరచక్ర’ లాంటి సినిమా చేస్తాడని ఎవరూ అనుకోలేదు. కానీ బాలయ్య సాహసం చేశాడు. ఎలాంటి ఫలితం వచ్చిందో తెలిసిందే. ఇప్పుడు తన వందో సినిమాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి ప్రెస్టీజియస్ మూవీ చేస్తున్న బాలయ్య.. దీని తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డితో సినిమా చేస్తాడంటూ ఒక షాకింగ్ రూమర్ బయటికి వచ్చింది.

వందో సినిమా తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రైతు’ అనే సినిమాను బాలయ్య చేస్తాడని మొన్నటి దాకా అందరూ అనుకుంటూ వచ్చారు. కానీ బాలయ్య మాత్రం కృష్ణారెడ్డి చెప్పిన ఓ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమా చేద్దాం అని హామీ ఇచ్చేశాడంటున్నారు. ఈ చిత్రానికి ఇప్పటికే ప్రి ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైపోయిందట. బాలయ్యకు సన్నిహితుడైన ‘వారాహి చలనచిత్రం’ అధినేత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడట.

ఎస్వీ కృష్ణారెడ్డి ఒకప్పుడు టాప్ ఫాంలో ఉండగా బాలయ్యతో ‘టాప్ హీరో’ అనే సినిమా తీశాడు. అది ఫ్లాప్ అయింది. 90ల్లో మంచి మంచి సినిమాలు తీసిన కృష్ణారెడ్డి ఆ తర్వాత ట్రాక్ తప్పాడు. ఈ మధ్య పూర్తిగా ఫేడవుట్ అయిపోయాడు. చివరగా ఆయన నుంచి వచ్చిన ‘యమలీల-2’ దారుణమైన ఫలితాన్నందుకుంది. ఇప్పుడున్న ఫాంలో కృష్ణారెడ్డితో బాలయ్య సినిమా అంటే అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి ఉండదు. మరి నిజంగా ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Tags:    

Similar News