బాలయ్య చుట్టే.. ఆ పాత దర్శకుడు!

ఇక బి.గోపాల్ కూడా బాలయ్యతో చివరి సినిమా చేసి దర్శకుడిగా రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నారు.

Update: 2023-08-04 11:28 GMT

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. దసరాకి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీలీల బాలకృష్ణ కూతురు పాత్రలో కనిపించబోతోంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు.

బాలయ్య కెరియర్ లో సమరసింహా రెడ్డి, నరసింహా నాయుడు లాంటి ఫ్యాక్షన్ కథలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బి.గోపాల్. వీరిద్దరి కాంబినేషన్ లో ఐదు సినిమాల వరకు వచ్చాయి. వాటిలో పల్నాటి బ్రహ్మనాయుడు మూవీ డిజాస్టర్ అయ్యింది.

మిగిలిన సినిమాలు అన్ని సూపర్ హిట్ అయినవే. మెగాస్టార్ చిరంజీవికి ఇంద్ర లాంటి హిట్ ని బిగోపాల్ ఇచ్చారు. ఈ దర్శకుడు చివరిగా ఆరడుగుల బుల్లెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అయితే బి.గోపాల్ చాలా కాలం నుంచి బాలయ్యతో మూవీ చేయాలని అనుకుంటున్నారు. కానీ డేట్స్ మాత్రం దొరకడం లేదు. రీసెంట్ గా బాలకృష్ణతో కలిసి బి.గోపాల్ కనిపించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబోలో మరో సినిమా వచ్చే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. తాజాగా తిరుమల దర్శనానికి వెళ్లిన బి.గోపాల్ కూడా బాలయ్య కోసం కథ సిద్ధం చేసుకున్నానని చెప్పారు.

మొత్తం కంప్లీట్ అయ్యాక ఆయన డేట్స్ చూసుకొని సినిమా చేస్తానని ప్రకటించారు. అంటే బాలయ్య ఇప్పటికే బి.గోపాల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడనే డౌట్ ఆయన మాటలతో వస్తోంది. కానీ ప్రస్తుతం బాలయ్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. అలాగే సక్సెస్ కోసం చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో తనకి హిట్స్ ఇచ్చిన పాత్ర డైరెక్టర్ కి అవకాశం ఇస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

ఇక బి.గోపాల్ కూడా బాలయ్యతో చివరి సినిమా చేసి దర్శకుడిగా రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నారు. మరి ఈ కాంబినేషన్ ఎంత వరకు సెట్ అవుతుందనేది చూడాలి. ఇక వేళ అయిన కూడా ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే 2025 వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News