జ‌ర్న‌లిస్ట్ కావ‌డంతోనే ఆ స్టార్ హీరో ఛాన్స్!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా జ్ఞాన్ వేల్ ద‌ర్శ‌క‌త్వంలో `వెట్టేయాన్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-22 22:30 GMT

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా జ్ఞాన్ వేల్ ద‌ర్శ‌క‌త్వంలో `వెట్టేయాన్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య సినిమా ప్రేక్ష‌కుల‌ముందుకొస్తుంది. `జైభీమ్` స‌క్సెస్ చూసి జ్ఞాన్ వేల్ కి ర‌జ‌నీ ఈ అవ‌కాశం ఇచ్చారు. సూర్య న్యాయ‌వాది పాత్ర‌లో న‌టించిన `జైభీమ్` ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. ఓటీటీ రిలీజ్ అవ్వ‌డం వ‌ల్ల సినిమా ప్రేక్ష‌కులంద‌రికీ చేర‌లేక‌పోయింది.

కానీ థియేట‌ర్లో రిలీజ్ అయితే ఈ సినిమా ఓ సంచ‌ల‌నం అయ్యేది. జాతీయ అవార్డు సైతం అందుకో వాల్సిన గొప్ప చిత్ర‌మిది. కానీ ఇలాంటి సినిమాల‌పై రాజ‌కీయాలు ప‌నిచేస్తుంటాయి. ఆ కార‌ణంగా జాతీయ అవార్డు కు దూర‌మైంది. ఇవ‌న్నీ చూసి ర‌జ‌నీ జ్ఞాన్ వేల్ ని పిలిచి మ‌రీ `వెట్టేయాన్` చాన్స్ ఇచ్చారు. అయితే ఈ ఛాన్స్ ఇవ్వ‌డానికి మ‌రో ముఖ్య కార‌ణం కూడా ఉంద‌ని తెలుస్తోంది.

జ్ఞాన్ వేల్ ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఓ జ‌ర్న‌లిస్ట్ అట‌. ఈ విష‌యాన్ని రజ‌నీకాంత్ రివీల్ చేసారు. జ్క్షాన్ వేల‌కి అసిస్టెంట్ గా ప‌నిచేసిన అనుభ‌వం లేదు. డైలాగ్ రైట‌ర్ గా మాత్రం కొన్నిసినిమాల‌కు ప‌నిచేసాడు. 2017 లో `కొట‌తిల్లి ఒరుత్త‌న్ `అనే సినిమా చేసాడు. ఆ త‌ర్వాత రెండ‌వ సినిమా ఛాన్స్ రావ‌డానికి నాలుగేళ్లు ప‌ట్టింది. అదే `జైభీమ్`. అయితే అస్టిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేయ‌క‌పోవ‌డంతో లోకేష్‌క‌న‌రాజ్, నెల్స‌న్ దిలీప్ కుమార్ లా సినిమా తీయ‌లేను అన్న సంగ‌తి ర‌జ‌నీకి ముందే చెప్పారుట‌.

ర‌జ‌నీ కూడా జ్ఞాన్ వేల్ ప‌ల్స్ ప‌ట్టుకుని అలా తీయ‌కూడ‌దు నీ స్టైల్లో తీయాలి...అలాగైతేనే సినిమా చేద్దాం అనే భ‌రోసా క‌ల్పించారుట‌. `మీరు సందేశాత్మ‌క చిత్రాలు చేస్తుంటారు. నేను క‌మ‌ర్శియ‌ల్ సినిమాలు చేస్తాను. మీ స్టైలు వేరు..నా స్టైల్ వేరు అని చెప్పా. దాంతో జ్ఞాన్ వేల్ క‌థ వినిపించాడు. అది నాకెంతో న‌చ్చింది` అందుకే క‌లిసి ప‌నిచేసాం అని ర‌జ‌నీకాంత్ అన్నారు. అమితాబ‌చ్చ‌న్ కూడా సినిమా క‌థ‌తో పాటు, త‌న పాత్ర ఎంతో గొప్ప‌గా ఉండ‌టంతోనే చేస్తున్నాన‌ని తెలిపారు.

Tags:    

Similar News