పవన్ మూవీస్ కి బూస్ట్ !

తెలుగు రాష్ట్రాలలో ఈ ఎన్నికల కారణంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ కూడా అమాంతం పెరిగిందని చెప్పొచ్చు.

Update: 2024-06-05 03:42 GMT

ఏపీలో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ విజయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకంగా మారిందని రాజకీయ విశ్లేషకులు సైతం ఒప్పుకుంటున్నారు. ఈ స్థాయి విజయం ఆయన వలనే సాధ్యం అయ్యిందని అంటున్నారు. జాతీయ స్థాయిలో సైతం పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. నేషనల్ మీడియా పవన్ కళ్యాణ్ నిర్ణయాలు, ఆలోచనలని ప్రశంసిస్తుంది.

తెలుగు రాష్ట్రాలలో ఈ ఎన్నికల కారణంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ కూడా అమాంతం పెరిగిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే సినిమాల పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం రెండు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. అలాగే రీజనల్ మూవీగా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది. ఈ ఎన్నికలతో పెరిగిన పవన్ కళ్యాణ్ క్రేజ్ ఈ సినిమాలకి కూడా బాగా ఉపయోగపడుతుందనే మాట వినిపిస్తోంది.

సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ, హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ క్యారెక్టర్స్ పోషిస్తున్నారు. అలాగే హరిహర వీరమల్లు కూడా చారిత్రాత్మక వీరుడి కథాంశంతో సిద్ధం అవుతోంది. ఈ సినిమాలకి ఎన్నికల ఫలితాలు బోనస్ అనే మాట సినీ సర్కిల్ లో వినిపిస్తోంది. ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలలో ఒకటి మాత్రం కచ్చితంగా ఈ ఏడాదిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

ఈ రెండు సినిమాలకి సంబందించిన కొంత పెండింగ్ షూట్ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా త్వరలో వాటిని పూర్తి చేయడంపై ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ముందుగా ఏ చిత్రాన్ని పూర్తి చేస్తాడనేదానిని బట్టి వాటి రిలీజ్ ఆధారపడి ఉంటుంది. నిజానికి ఓజీ సెప్టెంబర్ లో, హరిహరవీరమల్లు డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని ఆ చిత్ర నిర్మాతలు ఎనౌన్స్ చేశారు. ఈ ఎన్నికల రిజల్ట్ కారణంగా సినిమాలకి కూడా డిస్టిబ్యూటర్స్ నుంచి మంచి ఆఫర్స్ వస్తాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఎన్నికల సక్సెస్ తో ఆయన రాజకీయ ప్రస్థానానికి మంచి రోజులు వచ్చాయని అభిమానులు భావిస్తున్నారు. అలాగే ఓజీ, హరిహరవీరమల్లు సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ గట్టి సక్సెస్ లు అందుకుంటాడని బలంగా నమ్ముతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మరో గబ్బర్ సింగ్ కావడం ఖాయం అని అభిమానుల నుంచి వినిపిస్తోన్న మాట.

Tags:    

Similar News