కొంటె వేషాలతో ఓర్రీ ఇలాగే బుట్ట‌లో వేస్తున్నాడు!

అత‌డు ధ‌రించిన‌ది 'మోనోక్రోమ్ కౌ మస్కట్ కాస్ట్యూమ్‌'.. అత‌డి వేషాన్ని జాన్వీ త‌న ఫోన్ లో క్లిక్ చేసింది.

Update: 2024-10-25 13:46 GMT

సెల‌బ్రిటీ కిడ్స్ గుండెల్లో ఎప్పుడూ గిలిగింత‌లు పెడుతుంటాడు ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్ర‌త‌మ‌ణి. అత‌డి మాయాజాలం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అందుకే ఓర్రీ లేని లేట్ నైట్ పార్టీ లేదు. చిల్లింగ్ మ్యాడ్ ఫంక్ష‌న్ లేదు. స్టార్ కిడ్స్ నైసా దేవ‌గ‌న్, జాన్వీ, సారా, అన‌న్య‌, ఖుషీ, షాన‌య‌ వంటి వారికి అత్యంత స‌న్నిహితుడు ఒర్రీ. త‌న స్నేహితురాళ్ల‌ను ఎప్పుడూ న‌వ్విస్తూ ఉంటాడు అత‌డు. వారి ఆనందంలో అత‌డు ఒక భాగం.

ముఖ్యంగా శ్రీ‌దేవి కుమార్తె జాన్వీ కపూర్ ఓర్హాన్ అవత్రమణికి గొప్ప స్నేహితురాలు. ఆ ఇద్దరూ ఓ చోట చేరితే ర‌చ్చ ర‌చ్చే. అందుకు ఇవిగో ఈ ఫోటోలే సాక్ష్యం. ఆ ఇద్ద‌రూ ఇంటర్నెట్‌లో ఎగ్జ‌యిట్ చేసే పోస్ట్‌లు, వీడియోలను నిరంత‌రం త‌మ సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తుంటారు.

ఇటీవల ఓర్రీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసాడు. అందులో జాన్వీ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతూ క‌నిపించింది. అతడు 'కౌగర్ల్'లుక్ పేరుతో ఆవులా దుస్తులు ధరించి ఫ‌న్ క్రియేట్ చేసాడు. అత‌డి వేషానికి జాన్వీ క‌పూర్ న‌వ్వు ఆపుకోలేక‌పోయింది. అత‌డు ధ‌రించిన‌ది 'మోనోక్రోమ్ కౌ మస్కట్ కాస్ట్యూమ్‌'.. అత‌డి వేషాన్ని జాన్వీ త‌న ఫోన్ లో క్లిక్ చేసింది. ''చూడండి, ఇది తమాషా కాదు. మీరు నన్ను ఆవులా దుస్తులు ధరించమని చెప్పారు'' అని ఓర్రీ అక్క‌డ ప్ర‌వేశించ‌డం ఈ వీడియోలో క‌నిపించింది.

జాన్వీ దానికి స‌మాధాన‌మిస్తూ.. ''నేను చెప్పింది... కౌగర్ల్... ఆవు కాదు'' అని న‌వ్వేసింది. ఓర్రీ చిరునవ్వుతో తన మొత్తం రూపాన్ని ప్రదర్శిస్తూ చేతులు పైకెత్తి ఫోజులిచ్చాడు. నిన్న ఒక కొత్త విలన్ పుట్టాడు.. అని పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చాడు. దానితో పాటు ఆవు ఎమోజి కూడా షేర్ చేసాడు. ఈ ప్ర‌త్యేక‌మైన దుస్తులు బావున్నాయ‌ని, ఆవులా ఎప్పుడు మారావు ఓర్రీ అని చాలామంది అభిమానులు వ్యాఖ్య‌ల‌ను షేర్ చేసారు. ఇటీవ‌ల ఓర్రీ, జాన్వీల కామ‌న్ ఫ్రెండ్ వివాహంలో త‌మాషా సంగ‌తి ఇది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... చివరిసారిగా జాన్వీ 'ఉలాజ్‌'లో కనిపించింది. తదుపరి రోమ్-కామ్ 'సన్నీ సంస్కృతీ కి తులసి కుమారి'లో వరుణ్ ధావన్‌తో కలిసి కనిపించనుంది. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్న‌ ఈ చిత్రంలో రోహిత్ సరాఫ్, మనీష్ పాల్, అక్షయ్ ఒబెరాయ్, సన్యా మల్హోత్రా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దుల్హనియా ఫ్రాంచైజీ ఫేమ్ శశాంక్ ఖైతాన్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హిరూ యష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా , శశాంక్ ఖైతాన్ నిర్మాత‌లు. 18 ఏప్రిల్ 2025న సినిమా థియేటర్లలోకి రానుంది.

Tags:    

Similar News