పిక్‌ టాక్‌ : మతి పోగొడుతున్న అందాల జాన్వీ

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది.

Update: 2024-06-25 06:52 GMT

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది. కానీ ఇప్పటి వరకు అక్కడ ఏ ఒక్క సినిమాతో హిట్‌ కొట్టలేక పోయింది. అయినా కూడా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది.


ప్రస్తుతం టాలీవుడ్‌ లో ఎన్టీఆర్‌ కు జోడీగా 'దేవర' సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు మరో వైపు రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు కాంబో మూవీలో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. ఒకే సారి టాలీవుడ్‌ లో రెండు పెద్ద సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ముందు ముందు బాలీవుడ్‌ లో కూడా హిట్‌ కొట్టాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది.


తాజాగా మరోసారి ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేసింది. విభిన్నమైన డ్రెస్ లో జాన్వీ కపూర్‌ కన్నుల విందు చేసింది. నడుము అందం చూపిస్తూ, క్లీవేజ్ షో చేసిన ముద్దుగుమ్మ షో కి నెటిజన్స్‌ ఫిదా అవుతున్నారు.


ఇలాంటి ఫోటో షూట్స్ కారణంగానే ఇన్నాళ్లు వార్తల్లో నిలుస్తోంది. అంతే కాకుండా హీరోయిన్‌ గా వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి అందగత్తెకు దక్కాల్సిన ఆఫర్లు ఇన్నాళ్లు దక్కలేదని కూడా కొందరు అంటున్నారు.


ఎన్టీఆర్‌ తో చేస్తున్న దేవర సినిమాను సెప్టెంబర్‌ లో విడుదల చేయబోతున్నారు. ఎన్టీఆర్‌ తో జాన్వీ కపూర్‌ దేవర 2 లో కూడా కనిపించబోతున్న విషయం తెల్సిందే. రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌ ల జోడీ కోసం మెగా ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News