నీలి రంగు క‌ళ్ల‌తో పుట్టిన స్టార్ కిడ్స్ వీళ్లు

ఇప్పుడు ఆ మెగా కుటుంబంలో ఇద్ద‌రు కిడ్స్ నీలి రంగు క‌ళ్ల‌తో న‌వన‌వ‌లాడుతున్నారు. వారి క‌ళ్లు చుట్టూ ప‌రిస‌రాల్లో మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నాయ‌ట‌.

Update: 2024-10-18 01:30 GMT

రెగ్యుల‌ర్ బ్లాక్ ఐస్ (క‌ళ్లు)తో పుట్టేవాళ్లు వేరు..! నీలి రంగు క‌ళ్లు లేదా గాజు క‌ళ్ల‌తో మ్యాజిక్ చేసే కిడ్స్ వేరు. ఇప్పుడు ఆ మెగా కుటుంబంలో ఇద్ద‌రు కిడ్స్ నీలి రంగు క‌ళ్ల‌తో న‌వన‌వ‌లాడుతున్నారు. వారి క‌ళ్లు చుట్టూ ప‌రిస‌రాల్లో మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నాయ‌ట‌. భవిష్య‌త్ లో స్టార్లు అవుతారు కాబ‌ట్టి వారి నీలి క‌ళ్లు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా చ‌ర్చ‌ల్లో నిలవ‌డం ఖాయ‌మ‌ని భావిస్తున్నారు.

కరిష్మా-కరీనా కపూర్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో దీని గురించిన ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఈ జోడీ షోకి కొత్తందాన్ని తెచ్చారు. క‌పిల్ షోలో వారు చిన్ననాటి అంద‌మైన కథలను బయటపెట్టారు. సిస్ట‌ర్స్ త‌మ‌ ప్రియమైన తాత, లెజెండరీ రాజ్ కపూర్ గురించి కొన్ని రహస్యాలను షేర్ చేసారు. క‌రిష్మా ఎప్పుడూ రాజ్ కపూర్‌కి అత్యంత ఇష్టమైన అమ్మాయి అని కరీనా వెల్లడించింది. నీలి రంగు క‌ళ్ల‌తో త‌న సోద‌రి అంద‌రినీ క‌ట్టి ప‌డేయ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని కూడా తెలిపింది.

కపిల్‌తో చాట్ చేస్తూ కరీనా ఇలా చెప్పింది, ``కరిష్మా ఎప్పుడూ తాత‌య్య‌(దాదాజీ)కు ఇష్టమైన మనవరాలు. ఎందుకంటే ఆమె కంటి రంగు దాదాజీకి సరిపోలింది. అవే నీలి కళ్ళు. పైగా త‌నే మొదటి మనుమరాలు కూడా. కాబట్టి తాత‌య్య‌ చాలా ఉత్సాహంగా ఉండేవాడు`` అని తెలిపింది. దీనికి కరిష్మా ప్ర‌తిస్పందిస్తూ.. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నా తర్వాత అది తైమూర్.. తరువాత రాహా.. అంద‌రికీ దాదాజీలాంటి కంటి రంగు(నీలి రంగు) ఉంటుంది.. అని కరీనా తెలిపిది.

నిజానికి శిశువుకు నీలి కళ్ళు ఉంటే తప్ప తాను ఆసుపత్రికి కూడా రానని రాజ్ క‌పూర్ హెచ్చ‌రించార‌ని గ‌తంలో త‌న తాత గురించి క‌రిష్మా స్వ‌యంగా చెప్పారు. అతని కుమార్తె రీతూ నందా రాసిన `రాజ్ కపూర్: ది వన్ అండ్ ఓన్లీ షోమ్యాన్‌` పుస్త‌కంలో క‌రిష్మా త‌ల్లి బబిత కూడా ఈ విష‌యాన్ని ధృవీక‌రించారు. లోలో పుట్టిన రోజు నాకు గుర్తుంది, బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో నా మామగారు తప్ప కుటుంబం అంతా నా పక్కనే ఉన్నారు. . అప్పుడే పుట్టిన బిడ్డకు నీలికళ్లు ఉంటేనే ఆస్పత్రికి వస్తానని చెప్పారు. లోలో నా మామగారిలా లోతైన నీలి కళ్ళు ఉన్నందుకు ప్రభువుకు ధన్యవాదాలు`` అని పుస్త‌కంలో రాసారు.

రాజ్ కపూర్ భారతీయ సినిమా షోమ్యాన్. బాలీవుడ్‌పై మాత్రమే కాకుండా అతని కుటుంబ వారసత్వంపైనా శాశ్వత ప్రభావాన్ని మిగిల్చాడు. నటుడు పృథ్వీరాజ్ కపూర్ కుమారుడిగా, రాజ్ కపూర్ రాజవంశాన్ని ముందుకు తీసుకెళ్లాడు. లెగ‌సీని కాపాడాడు. క‌పూర్ కుటుంబం భారతీయ చలనచిత్రంలో అత్యంత ప్రభావవంతమైన కుటుంబాల‌లో ఒకటిగా మారింది. కపూర్‌కి ఐదుగురు పిల్లలు ఉన్నారు. రణధీర్, రిషి, రాజీవ్, రీతు, రీమా. ఆయన మనవళ్లు ఇప్పుడు బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ముఖాలు. అతడి మనవరాలు కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఖాన్ ఇద్దరూ విజయవంతమైన నటీమణులు. కరిష్మా రాజా హిందుస్తానీ - దిల్ తో పాగల్ హై వంటి హిట్‌లతో 90లను పాలించింది. అయితే కరీనా 2000లో తన అరంగేట్రంలో జబ్ వి మెట్ , కభీ ఖుషీ కభీ గమ్ వంటి చిత్రాలలో ఐకానిక్ పాత్రలతో అల‌రించింది. ప‌రిశ్ర‌మ అగ్ర క‌థానాయిక‌లుగా సిస్ట‌ర్స్ ఏలారు. బాలీవుడ్ మెగా కుటుంబం (క‌పూర్ ఫ్యామిలీ)కి సంబంధించిన ప్ర‌తి విష‌యం అభిమానుల‌ను ఎగ్జ‌యిట్ చేస్తున్నాయి.

గాసిప్‌లు తాజాగా ఉంచుతాయి:

క‌పిల్ శ‌ర్మ షోల సిస్ట‌ర్స్ మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యాన్ని చ‌ర్చించారు. అది త‌మ‌పై వ‌చ్చే గాసిప్పుల గురించిన ప్ర‌స్థావ‌న‌. గాసిప్స్ ఎప్పుడూ త‌మ‌ను ప్ర‌జ‌ల్లో ఫ్రెష్ గా ఉంచుతాయ‌ని సిస్ట‌ర్స్ అన్నారు. కరిష్మా మాట్లాడుతూ.. తన సోదరి కరీనా ఎప్పుడూ గాసిప్‌లతో తాజాగా ఉంటుందని అంది. కరీనా, రణబీర్ కపూర్, కరణ్ జోహార్ ప్ర‌స్థావ‌న వ‌చ్చింది.తాను గాసిప్‌లను వెంబడించనని అయితే అవి వాటంత‌ట అవే పుట్టుకొస్తాయ‌ని, దానిని విస్మరించలేనని కరీనా తనను తాను సమర్థించుకుంది. కరిష్మా అకా లోలో కూడా తన సోదరి అల్లరి పిల్ల అని అంది. ఇప్పుడు ఆమె చిన్న కుమారుడు జెహ్ కూడా తల్లి వలె చాలా అల్లరి పిడుగు.. అని తెలిపింది. ప్ర‌స్తుతం ఈ వినోదాత్మక ఎపిసోడ్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. కరీనా న‌టించిన‌ సింగం ఎగైన్ దీపావళికి విడుదలవుతుంది. రోహిత్ శెట్టి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News