మూవీ లో నాని వద్దు అన్న రాజమౌళి.. అసలు విషయం అదే..

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ చిత్రం ఎటువంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలుసు.

Update: 2024-08-27 09:11 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రాజమౌళికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. తెలుగు సినిమాల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పి టాలీవుడ్ సినిమాలకు వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చిన దర్శక ధీరుడు రాజమౌళి. జక్కన్న తన కెరీర్ లో తీసిన అన్ని సినిమాలు దాదాపు హిట్టే. అయితే అన్ని సినిమాలు ఒకే ఎత్తు ఈగ సినిమా మరొక్క ఎత్తు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక చిన్న ఈగను హీరోగా చేసి మొత్తం సినిమాని నడిపించేస్తాడు జక్కన్న.

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ చిత్రం ఎటువంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలుసు. భారీ విజువల్ వండర్ గా విమర్శకుల ప్రశంసలు పొందింది ఈ చిత్రం. అయితే ఈ మూవీకి సీక్వెల్ వస్తుందా రాదా అన్న విషయంపై చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మరొకసారి నాని ఈ మూవీ సీక్వెల్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం సరిపోదా శనివారం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధపడుతున్న నాని ప్రమోషన్స్ లో బాగా బిజీగా ఉన్నాడు. ఈనెల 29న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇక ఇందులో భాగంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ నాని సందడి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈక సీక్వెల్ గురించి నాని మాట్లాడారు. ఎప్పుడో ఒకసారి రాజమౌళితో తాను ఈగ సీక్వెల్ గురించి మాట్లాడినట్టు నాని వెల్లడించారు.

‘ఈగ మూవీస్ ఈక్వల్ చేద్దాము అన్నారు కదా.. మరి ఎప్పుడు మొదలుపెడదాం’అని నాని రాజమౌళి ని అడిగారట. దానికి రాజమౌళి ఒకవేళ నేను ఈగ 2 సినిమా చేసినా అందులో నీ అవసరం ఉండదు అని నవ్వుతూ చెప్పారట. మొత్తం సినిమా ఈగ చుట్టూ తిరుగుతుంది కాబట్టి సీక్వెల్లో కూడా అదే ఈగ తిరిగి వస్తుంది.. కాబట్టి సినిమాకి ఈగ ఉంటే చాలు అనేది రాజమౌళి ఉద్దేశం అని నాని పేర్కొన్నారు.

2012లో సమంత, నాని కాంబినేషన్లో వచ్చిన ఈగ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. రెండు జాతీయ అవార్డులు, మూడు సైమా అవార్డులతో పాటు ఐదు సౌత్ ఫిలింఫేర్ అవార్డులను ఈ చిత్రం దక్కించుకుంది. అసలు ఒక ఈగలాంటి క్యారెక్టర్ తో అంత పెద్ద సినిమాను చేసే ధైర్యం రాజమౌళికే సొంతం అని నాని పొగిడారు. దీంతో ఒకవేళ ఈగ మూవీకి సీక్వెల్ వచ్చిన అందులో హీరో ఈగ మాత్రమే ఉంటుంది అన్న విషయం స్పష్టం అయిపోయింది.

Tags:    

Similar News