వారసులను దించేసిన నయన్.. భలే ఉన్నారుగా..

ఆ మొదటి ఫోటో కూడా తన ముద్దుల కుమారులతో తాను కలిసి దిగిన ఫోటోని షేర్ చేసుకుంది. నయన్, తన ఇద్దరు పిల్లలు ఒకేలాంటి డ్రెస్ ధరించారు.

Update: 2023-08-31 11:58 GMT

లేడి సూపర్ స్టార్ నయనతారను స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమెకు దక్షిణాదిన విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు, ఆమె నటించే సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పొచ్చు. ఓవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే, మరోవైపు హీరోల పక్కన నటించే అవకాశాన్ని అందుకుంటూ ముందుకు దూసుకుపోతోంది.


ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా, నయనతార సోషల్ మీడియాకు మాత్రం దూరంగానే ఉంటూ వచ్చారు. నిజానికి ఈ రోజుల్లో సోషల్ మీడియాకు దూరంగా ఉండటం అనేది మామూలు విషయం కాదు. కానీ, నయన్ ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. అయితే, తాజాగా ఆమె కూడా ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టింది. అడుగుపెట్టడమే మొదటి ఫోటో కూడా షేర్ చేసింది.

ఆ మొదటి ఫోటో కూడా తన ముద్దుల కుమారులతో తాను కలిసి దిగిన ఫోటోని షేర్ చేసుకుంది. నయన్, తన ఇద్దరు పిల్లలు ఒకేలాంటి డ్రెస్ ధరించారు. ఇక ముగ్గురూ కళ్లకు అద్దాలు పెట్టుకోవడం విశేషం. తొలిసారి తన కొడుకుల ఫేస్ రివీల్ చేసింది. అంతకు ముందు కూడా తన భర్త విగ్నేష్ ఖాతా నుంచి వారి కుమారుల ఫోటోలు షేర్ చేశారు. కానీ, అందులో వాళ్ల ముఖాలు చూపించలేదు. తొలిసారి కొడుకుల ఫోటోలు షేర్ చేయడంతో, ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.

కాగా, నయన్ తన ఎకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కేవలం ఐదు ఫోటోలు మాత్రమే షేర్ చేశారు. అందులో రెండు ఫోటోలు తన కొడుకులతో కలిసి ఆమె దిగినవి కాగా, మిగిలిన మూడు తన కొత్త సినిమా జవాన్ కి సంబంధించినవి కావడం విశేషం. అవి కూడా ఈ రోజు విడుదలైన ట్రైలర్లే కావడం విశేషం. ఈరోజు విడుదలైన ట్రైలర్ కూడా ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ రోజు విడుదలైన జవాన్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. తొలిసారి నయన్ ఈ మూవీ ద్వారా బాలీవుడ్ కి పరిచయం అవుతోంది. ఈ మూవీలో షారూక్ హీరో కాగా, విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News